English | Telugu

తన్మయ్ ని పెళ్లి చేసుకుంటున్న రాకింగ్ రాకేష్..

రాకింగ్ రాకేష్ ఎంతో ప్రేమించి జోర్దార్ సుజాతను పెళ్లి చేసుకున్నాడన్న విషయం అందరికీ తెలిసిందే. ఐతే ఇప్పుడు రాకేష్ తన్మయ్ మోజులో పడి సుజాతను వదిలేయాలని అనుకుంటున్నాడు. తన్మయ్ ని వివాహం చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. ఐతే తన్మయ్ తో పెళ్లి కోసం సుజాతను నానా మాటలు అనేశాడు.. సుజాత ముఖం అరటి తొక్కాలా ఉందని, ఆమెను ఎవరు పెళ్లి చేసుకుంటారని కామెంట్స్ చేసేసాడు. అసలు ఎవరు చేసుకుంటారండీ ఇలాంటి అమ్మాయిని.. ఎవరు సుజాతను పెళ్లి చేసుకుంటాడో వాడు చచ్చాడే అంటూ మౌనం కూడా పాటించాడు.

ఇక సుజాత ఆ రాకేష్ కామెంట్స్ కి ఫీలైపోయింది పాపం. ఏంటా ఫేస్..చూడు తన్మయ్ ఫేస్ ఎలా ఉందో..తన్మయ్ ని చూస్తే ఆమె అందానికి అందరూ కుళ్ళుకుని ఏడ్చి చస్తారు అన్నాడు రాకేష్. సుజాతను చూస్తే కుక్కలు కూడా వెంటపడవ్..అని మరీ ఎక్కువ కామెంట్స్ చేసేసరికి సుజాత ఇక ఊరుకోలేదు అందుకే రీసెంట్ గా ఒక కుక్క ఎమ్మట పడింది అని కౌంటర్ ఇచ్చింది. సుజాత ఎక్కువ మాట్లాడుతోంది అందుకే ఆమెను ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ కి తీసుకెళ్తే అక్కడ షాక్ ట్రీట్మెంట్ ఇస్తారు..అది ఇచ్చిన వెంటనే మెంటల్ తగ్గిపోతుంది అని రాకేష్ ఉచిత సలహా ఇచ్చేసరికి సుజాత ఇక ఊరుకోలేదు మీరెన్ని సార్లు పెట్టించుకున్నారు అని గట్టిగా సీరియస్ గా అడిగేసింది దాంతో రాకేష్, తన్మయ్ ముఖాలు మాడిపోయాయ్. ఇక ఎందుకొచ్చిందిలే అనుకున్న రాకేష్ "నేను తన్మయ్ ని పెళ్లిచేసుకుంటున్నా మీ ఆశీర్వాదాలు కావాలి" అని సుజాతను అడిగేసరికి "తప్పకుండా నా ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి" అని చెప్పింది సుజాత ...అలాగే తన్మయ్ విష్ కూడా చేసేసింది. ఇక ఇదంతా నిజమేనేమో అనుకుంటున్నారా కాదు ఎక్స్ట్రా జబర్దస్త్ లో ఈ వారం పెర్ఫార్మ్ చేసిన రాకేష్ స్కిట్.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.