English | Telugu
మిస్టర్ పర్ఫెక్ట్, రంగస్థలం మూవీస్ వలన చాలా డిస్టర్బ్ అయ్యాను..
Updated : Jul 7, 2025
చక్రవాకం, మొగలిరేకులు సీరియల్స్ అనగానే ఆర్కె. నాయుడు అలియాస్ సాగర్ గుర్తు రాకుండా ఉండరు. రీసెంట్ గా అతను "ది 100 " అనే మూవీలో నటించాడు. నటుడిగా కాకుంటే పోలీస్ అవ్వాలనే కల ఉండేదని సుమ చాట్ షోలో చెప్పుకొచ్చారు. మిస్టర్ పర్ఫెక్ట్, రంగస్థలం మూవీస్ లో ఛాన్సెస్ వచ్చాయి కానీ దాని వెనక స్టోరీ కూడా చెప్పారు. "మొగలి రేకులు పీక్ లో ఉన్నప్పుడు మిస్టర్ పర్ఫెక్ట్ మూవీలో శివాజీ అనే క్యారెక్టర్ గురించి చెప్పారు. ప్రభాస్ గారికి సెకండ్ లీడ్ గా అని చెప్పారు. ఐతే అప్పటికి నాకు మూవీస్ కి వెళ్లాలన్నా ఆలోచన లేదు. సీరియల్స్ లో చక్కగా నడుస్తోంది కదా అనుకున్నా. మంజుల నాయుడు గారికి ఇలా ఒక అవకాశం వచ్చింది అని అడిగాను.
బిందు నాయుడు గారిని అడగమన్నారు. ఐతే ఆవిడ మూవీ కాబట్టి డేట్స్ అడ్జస్ట్ చేస్తాను. కానీ 15 డేస్ కాబట్టి చాలా కష్టం కానీ ఓకే అని చెప్పారు. ఇక అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ నేను అనుకున్న క్యారెక్టరైజెషన్ కనిపించలేదు. చాలా నిరుత్సాహపడ్డాను. ఇది కాదు కదా నేను అనుకున్నది అనిపించింది. అలా కొన్ని రోజులు షూటింగ్ డేట్స్ ఇచ్చాను. ఫస్ట్ మూడు రోజులు షూటింగ్ జరగలేదు. ఏవో కొన్ని సీన్స్ చేసారు. కానీ అది కాదు కదా క్యారెక్టర్ అంటే అనిపించి డైరెక్టర్ ని అడిగాను. అర్ధం చేసుకోండి. అప్పుడప్పుడు రోల్స్ మారతాయి అన్నారు. కానీ నాకు నచ్చలేదు వచ్చేసాను. కానీ ఆ సీన్ ని మూవీలో ఉంచేశారు. ఐతే ఆ మూవీలో సీన్ చూసాక అందరూ అలాంటి క్యారెక్టర్ చేశావేంటి అని అడిగారు. అలాగే టి.సుబ్బిరామి రెడ్డి గారు కూడా ఫోన్ చేసి అలాంటి రోల్ చేశావేంటి అని అడిగారు. దాంతో నేను చాల డిస్టర్బ్ అయ్యాను. ఆ తర్వాత రంగస్థలం మూవీ టైంలో కూడా సుకుమార్ గారు అడిగారు. ఐతే మిస్టర్ పర్ఫెక్ట్ ఇన్సిడెంట్ మొత్తం చెప్పాను. కానీ అలా జరగదు అన్నారు. ఐతే తర్వాత ఆది గారిని కలిసారని తెలిసింది. ఆది గారు కూడా మొదట్లో ఒప్పోకోలేదు. నేను మనసు మార్చుకొని చేద్దాం అనుకున్నాను. కానీ, సరిగ్గా అదే సమయంలో మళ్ళీ ఆది గారు ఓకే చెప్పేశారు." అని చెప్పుకొచ్చారు.