English | Telugu

బిగ్ బాస్ సీజన్ 9 కి ఛాన్స్ వస్తే వస్తావా ?

బిగ్ బాస్ సీజన్ 9 త్వరలో ప్రారంభం కాబోతోందన్న వార్త ఇప్పుడు బిగ్ బాస్ ఫాన్స్ ని ఫుల్ ఖుషీ చేస్తోంది. ఐతే ఓల్డ్ బిగ్ బాస్ సీజన్స్ లో వచ్చిన కంటెస్టెంట్స్ ని మళ్ళీ ఈ కొత్త సీజన్ లో చూడొచ్చా అని కూడా కొంతమంది ఫాన్స్ అడుగుతున్నారు. ఇప్పుడు ఆర్జె కాజల్ ని కూడా అలాగే అడిగారొక ఫ్యాన్. "బిగ్ బాస్ సీజన్ 9 మిమ్మల్ని చూడొచ్చా" అని.. దానికి కాజల్ తన ఆన్సర్ ని ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసింది. "జీవితంలో కొన్ని విషయాలు చాలా విలువైనవి..వాటిని ఒక్కసారి మాత్రమే ఎక్స్పీరియన్స్ చేయాల్సి ఉంటుంది. మనసుకు హత్తుకునే సంఘటనలు ఏవైతే ఉంటాయో వాటిని అలాగే వదిలేయాలి కానీ వాటిని మళ్ళీ మళ్ళీ జరగాలని కోరుకోకూడదు.

అది మీకైనా, నాకైనా, మనల్ని సపోర్ట్ చేసేవాళ్ళకైనా. నేనొక బిగ్ బాస్ ఫ్యాన్ గా ఎం చెప్తాను అంటే రి-ఎంట్రీస్ అంటే నాకు ఇష్టం ఉండదు. దానికి కట్టుబడి ఉన్నాను కాబట్టే నేను మళ్ళీ బిగ్ బాస్ లోకి రి-ఎంట్రీ ఇవ్వాలనుకోవడం లేదు. నా బిగ్ బాస్ సీజన్ 5 జర్నీ మాత్రం నాకు లైఫ్ టైం ఎక్స్పీరియన్స్, మర్చిపోలేనిది, ఎమోషనల్ గా, నన్ను నన్నుగా అక్కడ ఆవిష్కరించుకున్న ఒక వాల్యుబుల్ జర్నీ. ఆ మెమోరీస్ ని అలాగే అపురూపంగా ఉంచుకోవాలని అనుకుంటున్నా కానీ రి-ఎంట్రీ ఇచ్చి వాటిని చెరుపుకోవాలని అనుకోవడం లేదు. ఎందుకంటే అవి టచ్ చేయలేనివి, మార్పులు చేర్పులు చేయలేనివి కాబట్టి ఆ జర్నీ నా మనసుకు ఎంతో హత్తుకుపోయింది..కాబట్టి నేను నెక్స్ట్ సీజన్ లో కనించను" అంటూ ఒక లాంగ్ పోస్ట్ ని తన స్టేటస్ లో పోస్ట్ చేసుకుంది కాజల్ ఆర్జే. మళ్ళీ ఆర్జేగా రావొచ్చు అని ఇంకో ఫ్యాన్ అడిగిన ప్రశ్నకు..అస్సలు టైం సెట్ కావడం లేదు అందుకే రావడం లేదు అని చెప్పింది.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.