Read more!

English | Telugu

నా తల్లి కంటే వెయ్యి రెట్లు ఎక్కువ బాధపెట్టావ్ వసుధార!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న 'గుప్పెడంత మనసు' సీరియల్ ఎపిసోడ్ -671 లోకి అడుగుపెట్టింది. శుక్రవారం జరిగిన ఎపిసోడ్ లో... మహేంద్రతో మాట్లాడుతుంటాడు రిషి. "ఎందుకు డాడీ నన్ను ఇలా చేస్తున్నారు. నేను ఎవరికీ పనికి రాని వాడినా... అందరూ నన్ను వదిలేసి వెళ్తున్నారు" అని అనుకుంటూ ఎమోషనల్ అవుతాడు రిషి.

అర్జెంట్ గా తన క్యాబిన్ కి రమ్మని వసుధారకి ఫోన్ చేస్తాడు రిషి. వసుధార వచ్చాకా.. తన టేబుల్ ఉన్న హార్ట్ సింబల్ చూపించి "ఈ హార్ట్ సింబల్ ఎందుకు పెట్టావు? ఎందుకు ఇలా నా హార్ట్ తో ఆడుకుంటున్నావ్? అసలెందుకు నా క్యాబిన్ కి వస్తున్నావ్" అని అడుగుతాడు. "సర్ మీతో మాట్లాడాలి. కాస్త నేను చెప్పేది ఒకసారి వినండి" అని వసుధార అనగానే... "ఇలా చీటికి మాటికీ నాతో మాట్లాడడానికి ప్రయత్నించకు. చెప్పాలి అంటున్నావ్. ఏం చెప్తావ్? పెళ్లి ఎలా జరిగింది.. బంధువులు ఎవరెవరు వచ్చారు. ఇదేనా నువ్వు చెప్పాలనుకుంటుంది. నీ పర్సనల్ విషయాలు నాకు చెప్పకు.. మన మధ్యలో మాటలు ఉంటే అవి ప్రాజెక్ట్ గురించి మాత్రమే అయ్యి ఉండాలి.. అవి మాత్రమే వింటాను" అని అంటాడు.  ఇక చేసేదేమీ లేక బాధపడుతూ "చివరిసారిగా అడుగుతున్నాను.. వింటారా? వినరా" అని అడుగుతుంది. వినను అని రిషి చెప్పడంతో... "ఇక నేను చెప్పాలని ప్రయత్నించను. మీరే తెలుసుకోవాలి" అని అనుకొని వెళ్తుండగా... "నా తల్లి కంటే వెయ్యి రెట్లు బాధపెట్టావ్ వసుధార" అని అంటాడు రిషి. "సర్ ఇప్పుడు నా మనసుకు గాయం అయింది" అంటూ వెళ్ళిపోతుంది వసుధార. 

ఆ తర్వాత రిషి దగ్గరికి దేవయాని వస్తుంది. లేని ప్రేమ ఉన్నట్లు నటిస్తూ ఉంటుంది. "వసుధారని మన కాలేజీ నుంచి పంపించండి... లేదా నువ్వైనా తన నుండి దూరంగా వెళ్ళు" అని మాట్లాడుతుంది దేవయాని. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే...!