English | Telugu

అసలు మీరు మనుషులా, రాక్షసులా?.. మండిప‌డిన ర‌ష్మీ!

రష్మీ జంతు ప్రేమికురాలు. వీధి కుక్కలంటే తనకు ఎంతో ఇష్టం కూడా. రోడ్ మీద వెళ్ళేటప్పుడు ఎక్కడైనా కుక్క బాధపడడం చూసిందంటే చాలు.. దానికి సేవ‌చేసి, వెంటనే తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక పోస్ట్ పెట్టేస్తుంది. అంత ఇష్టం అన్నమాట. ఇప్పుడు అలాంటిదే ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రష్మీ మనసు ఈ విషయంలో మాత్రం చాలా గొప్పదని చెప్పొచ్చు. వీధి కుక్కలకు తోచినంత ఫుడ్ పెడుతుంది. వాటికి అవసరమైతే షెల్టర్ కోసం ట్రై చేస్తుంది.

ఐతే కొంత మంది యజమానులు కుక్కల్ని ఇంట్లో పెంచుకుని రోడ్డు మీద వదిలేశారు. ఇప్పుడవి వర్షానికి తడుస్తూ తిండి లేక అవస్థలు పడుతున్నాయి. 24 గంటల్లో నాలుగు జాతులకు చెందిన కుక్కల్ని ఇలా రోడ్డు మీద వదిలేసి వెళ్లిపోవడంపై ఆమె ఆగ్ర‌హించింది. "కుక్కతో ఎమోషనల్ బాండింగ్ ఎంతో గొప్పది. అడాప్ట్ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాంటిది కొంచెం కూడా జాలి, దయ, శ్రద్ద లేదా" అంటూ మండిపడింది. ఎవరైతే తమ పెంపుడు కుక్కల్ని వదిలి వెళ్లిపోయారో వాళ్ళను కర్మ వెంటాడుతూ ఉంటుందని హెచ్చరించింది.

"మీ పిల్లలు కూడా రేపు మిమ్మల్ని అలా రోడ్డు పాల్జేస్తే ఎలా ఉంటుంది?" అనే పోస్ట్ ని తన ఇన్స్టా స్టేటస్ లో పెట్టింది రష్మీ. ఇక ఏదో తనకు తోచినంతలో హైదరాబాద్, వైజాగ్ లో ఫ్రీ పెట్ డాగ్ రెస్క్యూ వాన్స్ ని ఏర్పాటు చేసినట్లు కూడా చెప్పారు. అలాగే ఈ స్టేటస్ తో పాటు మరో స్టేటస్ కూడా పెట్టింది. గంగానది వరదల్లో మావటి ప్రాణాలను కాపాడిన ఏనుగును అతడు ములుగర్రతో బాధించడంపై రష్మీ బాధపడింది. ఇలా రష్మీ మూగ జీవాల సంరక్షణకై నిత్యం పోరాడుతూ ఉండ‌టాన్ని ప‌లువురు ప్ర‌శంసిస్తున్నారు.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.