English | Telugu

పదేళ్లు పూర్తి చేసుకున్న రష్మీ

జబర్దస్త్ షోకి రష్మీ యాంకర్ గా జర్నీ స్టార్ట్ చేసి పదేళ్లు పూర్తి చేసుకుంది. రోజురోజుకు తన యాంకరింగ్ ని మెరుగు పరుచుకుంటూ వెళ్ళింది.. యాంకర్ గా చేస్తూనే మరో వైపు మూవీస్ లో అవకాశాలను అందుకుంది. బోల్డ్ మూవీస్ లో ఎంతో బోల్డ్ గా నటించింది రష్మీ. ఇక ఏ స్క్రీన్ ఐనా సరే గ్లామర్ షో చేయడంలో రష్మీ తర్వాతే ఎవరైనా... సోషల్ మీడియాలో తన ఫాన్స్ తో ఎప్పుడూ టచ్ లోనే ఉంటుంది. ఆమెకు మూగ జీవాలంటే చాలా ఇష్టం.

వాటికి అన్యాయం జరిగింది అంటే చాలు క్షణం ఆలస్యం చేయకుండా స్పందిస్తూ ఉంటుంది. వాటి కోసం వైజాగ్ లో ఒక ఆర్గనైజషన్ కూడా స్టార్ట్ చేసింది. ఇక బుల్లితెర మీద తన జర్నీ స్టార్ట్ చేసి పదేళ్లు ఐన సందర్భంగా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ మొత్తం ఫాన్స్ అభిమానం , వాళ్ళ హార్ట్ ఫుల్ మెసేజెస్ తో నిండిపోయాయి. జబర్దస్త్ లో రష్మీకి అంత పేరు రావడానికి సుధీర్ కి కూడా మంచి హైప్ రావడానికి కారణం వాళ్ళ లవ్ ట్రాక్. బుల్లితెర మీద వీళ్ళ ప్రేమాయణం చూసిన ఆడియన్స్ వీళ్ళు నిజంగానే వివాహం చేసుకుంటారేమో అనిపించేలా చేసేవాళ్ళు. కానీ తర్వాత అదంతా షో రేటింగ్ కోసం మాత్రమేనని పెళ్లి చేసుకోవడం లేదని స్పష్టం చేశారు.

కానీ ఫాన్స్ ఎవరూ ఈ విషయాన్ని అస్సలు యాక్సెప్ట్ చేయలేదు. ఆ ఇద్దరూ పెళ్లి చేసుకుంటే చూడాలని ఆతృతగా ఎదురుచూసే అభిమానులు బోల్డు మంది ఉన్నారు. "హోలీ" మూవీ ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రష్మీ తర్వాత చాలా మూవీస్ లో సపోర్టింగ్ రోల్ లో నటించింది. తర్వాత ఇంకొన్ని మూవీస్ లో నటించింది కానీ ఆమెకు అనుకున్నంత మంచి కెరీర్ సిల్వర్ స్క్రీన్ మీద రాలేదు. "గుంటూరు టాకీస్" లో మెయిన్ లీడ్ చేసి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం "భోళా శంకర్" మూవీలో నటిస్తోంది. వెండితెర మీద పేరు రాకపోయినా బుల్లితెరను మాత్రమే ఎలేస్తోంది ఈ అమ్మడు. తాను యాంకరింగ్ చేసిన జబర్దస్త్ ఫస్ట్ ఎపిసోడ్ ని కూడా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసుకుంది. రీసెంట్ గా "బొమ్మ బ్లాక్ బస్టర్" మూవీలో నటించింది రష్మీ.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.