English | Telugu

అమ్మ దానిమ్మ బత్తాయో...పవన్ కళ్యాణ్ ఈ స్టేట్ కి గొప్ప


పృద్వి రాజ్ అంటే ఇండస్ట్రీలో స్పెషల్ డైలాగ్స్ తో బాగా పాపులర్ ఐన నటుడు. ఖడ్గం మూవీలో "30 ఇయర్స్ ఇండస్ట్రీ" డైలాగ్ తో అలాగే యమగోల.. అల్లరి నరేష్ మూవీలో "అమ్మ దానిమ్మ బత్తాయో" డైలాగ్ తో బాగా ఫేమస్ అయ్యాడు. ఇక రీసెంట్ గా ఆయన కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలను ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. "పాలిటిక్స్ లో తప్ప ఎందులోనూ నేను వేలు పెట్టను. బోర్డర్ లో ఫ్రంట్ లైన్ సోల్జర్స్ యుద్ధం చేయడానికి అనుక్షణం రెడీగా ఉంటారు. ప్రతీక్షణం వాళ్ళు దేశానికీ కాపలా కాస్తుంటారు. బోర్డర్ లో ఉండే సైనికుడు ఎంత గొప్పో పవన్ కళ్యాణ్ గారు ఈ స్టేట్ కి అంత గొప్ప. పవన్ కళ్యాణ్ గారు హ్యాట్సాఫ్. ఇక మా హిందూపూర్ బాలయ్య గారంటే ఎన్నికలు రాకముందే నేను చెప్పా. హ్యాట్రిక్ బాలయ్య. నిజంగా డౌన్ టు ఎర్త్. ఎవరి గురించి ఆయన డిస్కస్ చేయరు. వాళ్ళ నాన్న గారి చిత్రాలు, పాటలు వింటూ చూసుకుంటూ ఉంటారు తప్పితే వేరే క్రిటిసిజం అనేది ఆయన దగ్గర ఉండదు. అమ్మ దానిమ్మ బత్తాయో అనే డైలాగ్ బాగా ఎలా హిట్ అయ్యిందంటే యమగోల మూవీలో అల్లరి నరేష్ యముడి కూతురిని తీసుకుని పోలీస్ స్టేషన్ దగ్గర వదిలేసి వెళ్తాడు. కింద నుంచి కెమెరా రోల్ అవుతున్నప్పుడు ఇక్కడ ఒక డైలాగ్ ఉంటే బాగుంటుందని అనేసరికి అది డబ్బింగ్ లో నేను అమ్మ దానిమ్మ బత్తాయో అని అన్నా. అంతే బాగా వైరల్ ఐపోయింది.

నేను హీరోగా చేస్తే హీరోయిన్ గా తమన్నా ఐతే బాగుంటుంది అనుకున్నా. ఆవిడ మంచి ఆర్టిస్ట్. మహేష్ బాబుతో యాడ్ చేసింది. అందులో మహేష్ బాబు ఒళ్ళో పడేటప్పుడు, ఆవిడ ఎక్స్ప్రెషన్ చూసి అమ్మ దానిమ్మ బత్తాయో ఇలాంటమ్మాయితో హీరోగా చేస్తే బాగుంటుంది అనిపించింది. ఖడ్గం మూవీ షూటింగ్ కోసం రామకృష్ణ స్టూడియోస్ కి వెళ్లాం. 30 ఏళ్ళ నాటకానుభవం ఉన్న పుస్తకం ఒకటి వచ్చింది పావలా శ్యామల గారిది. ఆ లైట్ ఏంటి అని అడిగేసరికి బటర్ పేపర్ ఇక్కడ 30 ఇయర్స్ ఇండస్ట్రీ మాకు తెలీదా అన్నాను దాంతో లైట్ బాయ్స్ అంతా గొల్లుమని నవ్వుతున్నారు. అది కూడా అర్ధరాత్రి 1 గంటకు మొదలైన షూటింగ్. దాంతో ఈ డైలాగ్ బాగుంది కదా కంటిన్యూ ఐపో అన్నారు అలాగే ఆ డైలాగ్ వైరల్ అయ్యింది" అని చెప్పాడు పృద్వి రాజ్.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.