English | Telugu

రైతులకే ప్రైజ్ మనీ ఇస్తానన్న పల్లవి ప్రశాంత్!


బిగ్ బాస్ సీజన్-7 రోజు రోజుకి ఉత్కంఠభరితంగా సాగుతూ జనాల ఆదరణ పొందుతుంది. గతవారం ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఉండగా అందులో గౌతమ్ ఎలిమినేట్ అయి ఇప్పుడు టాప్-7 మిగిలారు. వీరిలో ఒక్కొ కంటెస్టెంట్ ఒక్కోరకమైన ఆటతీరుతో, మాటతీరుతో స్ట్రాటజీలతో ఉంటు వస్తున్నారు.

గతవారం టికెట్ టు ఫినాలే కోసం జరిగిన టాస్క్ లలో అంబటి అర్జున్ గెలిచి ఫైనల్ కి చేరుకున్నాడు. ఇక పద్నాలుగవ వారం నామినేషన్ లో లేకుండా సేవ్ అయ్యాడు. ‌అయితే వీకెండ్ లో వచ్చిన నాగార్జున ప్రైజ్ మనీని కంటెస్టెంట్స్ చెప్పాడు. ఈ సీజన్-7 విజేతకి 50 లక్షల డబ్బుతో పాటు మారుతి కారు, 15 లక్షల విలువైన జోయాలుకాస్ డైమండ్ నెక్లెస్ లభిస్తుందని నాగార్జున తెలిపాడు. ఇక ఈ వివరాలు చెప్పిన నాగార్జున.. మీరు 50 లక్షలు గెలిస్తే ఏం చేస్తారని ఒక్కో‌ కంటెస్టెంట్ ని అడిగాడు ‌నాగార్జున. మా మేనకోడలికి మంచి లైఫ్ ఇస్తాను‌. కొన్ని లోన్లు ఉన్నాయని ఈ డబ్బులతో అవన్నీ చేస్తానని అంబటి అర్జున్ అన్నాడు. మా అమ్మనాన్నలకి ఇప్పటివరకు సొంతంగా ఏమీ లేదని, ఈ డబ్బులు గెలిస్తే సొంత ఇల్లు కొనిస్తానని ప్రియాంక అంది. అనంతపూర్ లో కాకుండా హైదరాబాద్ లో సొంత ఇల్లు కొనిస్తానని అమర్ దీప్ అన్నాడు.

ఇక యావర్ తనకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటూ ఎమోషనల్ అయ్యాడు. మా అన్నయ్య మాకోసం చాలా కష్టపడుతున్నాడు. అసలు ఎలా బతుకుతున్నామో అర్థం కావట్లేదు. లోన్లు, EMI లు ఉన్నాయని, ఈ డబ్బులు కూడా సరిపోవు కానీ ఇవి హెల్ప్ అవుతాయని యావర్ అన్నాడు. ఆ తర్వాత శివాజీ వచ్చి.. అసలు ఇక్కడివరకు వస్తానని ఊహించలేదు. ఈ యాభై లక్షలు గెలిచాక ఏం చేస్తానో చెప్తానని, ఇది అందరికి రావాలని కోరుకుంటున్నానని శివాజీ అన్నాడు. ఇక ప్రశాంత్ వచ్చేసి.. రైతులకి ఇస్తాను సర్ అని అన్నాడు. ఎందుకని నాగార్జున అనగా.. ప్రతీ సంవత్సరం రైతులు పండించిన పంటకి సరైన ధర రావట్లేదు. అప్పులు పెరుగుతున్నాయి. ఇక పంట చేతికి వచ్చేసరికి ఏదో సమస్య వల్ల నాశనం అవుతున్నాయని, అలా చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అలాంటివారికి ఈ డబ్బులని ఇచ్చి సాయంగా ఉంటానని ప్రశాంత్ అన్నాడు. ఇది బిగ్ బాస్ సీజన్-7 టోటల్ ఎపిసోడ్ లోనే హైలైట్ గా నిలిచింది. ఒక రైతిబిడ్డగా హౌస్ లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్.. రైతల వెంటే ఉంటానంటూ చెప్పడంతో గూస్ బంప్స్ వచ్చాయి.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.