English | Telugu

పల్లవి గౌడ ‘నిండు నూరేళ్ళ సావాసం’ ఎప్పుడంటే!

టెలివిజన్ రంగంలో తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా వీక్షించేది స్టార్ మా టీవీ, జీ తెలుగు సీరియల్స్.. వీటిల్లో బాగా పాపులర్ అయినవి చాలానే ఉన్నాయి. స్టార్ మా టీవీలో బ్రహ్మముడి, కృష్ణ ముకుంద మురారి, గుప్పెడంత మనసు, గృహలక్ష్మి, మల్లి, నాగపంచమి ఉండగా.. జీ తెలుగులో రాధమ్మ కూతురు, రాధకు నీవేరా ప్రాణం వంటి సీరియల్స్ పాపులర్ అయ్యాయి.

పసుపు కుంకుమ, సావిత్రి మొదలైన సీరియల్స్ లో నటించిన పల్లవి గౌడ అందరికి సుపరిచితమే.. అయితే కొన్ని సంవత్సరాలుగా రెస్ట్ తీసుకున్న పల్లవి గౌడ.. చాలా గ్యాప్ తర్వాత రీఎంట్రీగా చేసిన సీరియల్... 'నిండు నూరేళ్ళ సావాసం'. పల్లవి గౌడ కన్నడ నటి.. తెలుగులో పసుపు కుంకుమ, సావిత్రి సీరియల్స్ చేసిన తర్వాత కన్నడలో గాలిపాట, పరిణయ, శాంతం పాపం వంటి సీరియల్స్ లో నటించింది. ఆ తర్వాత తెలుగులో చదరంగం, సూర్యకాంతం సీరియల్స్ లో నటించింది పల్లవి గౌడ. అయితే సీరియల్స్ తో పాటు పలు కన్నడ సినిమాలలో నటించి‌న పల్లవి గౌడ.. రెండు రాష్ట్రాలు, అమ్మ ఆవకాయ అంజలి లాంటి తెలుగు వెబ్ సిరీస్ లలో నటించింది. అయితే చాలా గ్యాప్ తర్వాత 'నిండు నూరేళ్ళ సావాసం' తో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది పల్లవి గౌడ.

తన కుటుంబమే శ్వాసగా.. ప్రేమకు చిరునామాగా.. అమాయకత్వమే ఆభరణంగా.. అందరిలో కనిపించే రూపమే మన అరుంధతి అంటూ పల్లవి గౌడ ఈ సీరియల్ లో పరిచయమవుతుంది. కాగా ఆమె భర్త మిలటరీలో చేసే సైనికుడు.. అతని పేరు అమరేంద్ర.. అయితే పల్లవి గౌడ ఒక ఆత్మ పాత్రలో కనిపిస్తుంది. అయితే తను చనిపోయాక పిల్లల సంరక్షణ కోసం అమరేంద్ర భాగమతి అనే అమ్మాయిని అపాయింట్ చేస్తాడు. అయితే ఆటలు, పాటలతో గడిచే పిల్లల బాల్యం భాగమతి చేతిలో ఉంది. మరి అమ్మ లేని లోటుని భాగమతి తీర్చగలదా.. చూడాలంటే అగస్ట్ 14 వ తేదీన ప్రారంభమ్యే ఈ సీరియల్ చూడాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.