English | Telugu

థామస్ ఆల్వా ఎడిసన్ ఎవరో తెలీదా... ఎంత వరకు చదువుకున్నావ్ బాబు?

యూట్యూబర్ గా కెరీర్ స్టార్ట్ చేసి యాంకర్ గా అలాగే నటుడిగా మారిన నిఖిల్ విజయేంద్ర సింహ గురించి సోషల్ మీడియాలో చాలా మందికి తెలుసు...ఆయన క్రియేట్ చేసే కంటెంట్ కి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పాపులర్ డిజిటల్ కంటెంట్ క్రియేటర్ గా అవార్డు కూడా అందుకున్నాడు. "నిఖిల్ తో నాటకాలు" పేరుతో సెలబ్రిటీస్ ని ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటాడు. సోషల్ మీడియా ఇన్ఫ్లుఎన్సర్ గా కూడా ఆయనకు ఎంతో మంది ఫాన్స్ ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ లో డైలీ అప్ డేట్స్ పెడుతూ ఉంటాడు. అలాంటి నిఖిల్ ఒక ప్రోగ్రాం కోసం న్యూయార్క్ వెళ్ళాడు.

అలా అక్కడ ఫుడ్ గురించి, బెస్ట్ ప్లేసెస్ గురించి వీడియోస్ చేస్తూ పోస్ట్ చేస్తున్నాడు. ఐతే ఇప్పుడు ఒక ప్లేస్ కి వెళ్ళాడు..అక్కడ వీడియో చేసి దాన్ని అప్ లోడ్ చేసి "ఈ ప్లేస్ కి వచ్చి కొత్త ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను" అని టాగ్ లైన్ పెట్టుకున్నాడు. ఐతే విషయం ఏమిటి అంటే ఆయనకు థామస్ ఆల్వా ఎడిసన్ అనే ఆయన ఎవరో తెలీదట. తెలియకుండానే ఒక వీడియో చేసాడు. అసలు థామస్ ఆల్వా ఎడిసన్ అనే ఆయన బల్బ్ ని కనిపెట్టారనే విషయం చిన్నపిల్లాడిని అడిగినా చెప్తాడు. కానీ నిఖిల్ కి మాత్రం తెలీదట. "థామస్ ఎడిసన్ పేరేంటి వింతగా ఉందని ఆయన గురించి తెలుసుకోవాలి అని అడిగితే వాళ్ళు చెప్పారు...థామస్ ఎడిసన్ బల్బ్ కనిపెట్టారు కదా .. ఆయన గుర్తుగా ఇక్కడ ఒక టవర్ ని ఏర్పాటు చేశారు.. అదే ఈ ఎడిసన్ టవర్...ఈ పక్కన ఒక రూమ్ కనిపిస్తోంది కదా..అందులోనే ఆయన ఎక్సపెరిమెంట్స్ కి యూజ్ చేసిన ఎక్విప్మెంట్ అక్కడ కనిపిస్తుంది" అని చెప్పాడు...ఈ వీడియో చూసిన నెటిజన్స్ మాత్రం "ఎడిసన్ అనే పేరు ఇప్పటివరకు వినలేదా..ఇంతకు ఎక్కడి వరకు చదువుకున్నావ్ బాబు...ఇదొకటి ఉందని కూడా తెలీదా" అని కామెంట్స్ చేస్తున్నారు. నిఖిల్ "హలో వరల్డ్" అనే వెబ్ సిరీస్ లో నటించాడు. కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కూడా కనిపించాడు.

Illu illalu pillalu : నర్మద జాబ్ పోయేలా చేసిన భద్రవతి.. ప్రేమ వెళ్ళిపోయిందిగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -310 లో...... నర్మద ఆఫీస్ కి వెళ్తూ వేదవతి దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది కానీ వేదవతి మాత్రం సైలెంట్ గా ఉంటుంది. అత్తయ్య నేను ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు నాతో నవ్వుతూ మాట్లాడాలి లేదంటే నాకు మంచి జరగదని నర్మద అంటుంది అయినా సైలెంట్ గా వేదవతి ఉంటుంది. అర్ధం అయింది నేను మీ వాళ్లకి ఎదురువెళ్తున్నానని కోపంగా ఉంది కదా.. నా డ్యూటీ నేను చేసానని నర్మద చెప్పి వెళ్ళిపోతుంది. కోపం కాదు బాధ మా వాళ్ళు నిన్ను ఏదైనా చేస్తారని భయంగా ఉందని వేదవతి అనుకుటుంది.

పృద్వి కోసం విష్ణు ప్రియ...ఆ షోకి అందుకే వెళ్లాను!

బిగ్ బాస్ లో రొమాంటిక్ కపుల్ గా విష్ణు ప్రియా - పృథ్వి జోడి మంచి పేరు తెచ్చుకుంది. ఒకరు లేకపోతె ఇంకొకరు లేరు అన్నట్టుగా ఉండేవాళ్ళు. కానీ బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాక పృథ్వి విష్ణు ప్రియను పట్టించుకోవడం మానేసాడు. విష్ణు ప్రియా మాత్రం పృద్వి జపం చేస్తూ ఉంటుంది. కానీ అతను ఇద్దరం ఫ్రెండ్స్ అని మాత్రమే అనేవాడు. అలాంటి పృద్వి గురించి విష్ణు ప్రియా ఒక ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు చెప్పింది . "కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ షో గురించి చెప్పాలంటే ఎం చెప్తావ్" అని విష్ణు ప్రియను హోస్ట్ అడిగింది. "నాకు దేవుడు రెండు సార్లు షోకి వెళ్ళడానికి ఛాన్స్ ఇచ్చాడు. ఫస్ట్ సీజన్ లో బేవార్సు వాళ్ళతో ఫ్లర్ట్ చేసాను.