English | Telugu

కిరాక్ ఆర్పీకి ఒకరోజు కేటాయించిన మెహ్రీన్!

ఒకప్పుడు జబర్దస్త్ లో కమెడియన్ గా పేరు తెచ్చుకున్న కిరాక్ ఆర్పీ గురించి అందరికీ తెలుసు. ఐతే ఆర్పీ నాగబాబుతో పాటు షో నుంచి బయటకు వచ్చేసి ఫుడ్ బిజినెస్ రంగంలోకి వచ్చేసి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసును ఫేమస్ చేసే పనిలో పడ్డాడు.

దీనికి సంబందించిన ఎన్నో బ్రాంచెస్ ని ఓపెన్ చేసాడు. రెస్టారెంట్ బిజినెస్ లో మంచి సక్సెస్ అందుకున్నాడు. హైదరాబాదులో ఎన్నో బ్రాంచ్ లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఆంధ్రలోనూ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు రెస్టారెంట్ ప్రారంభించారు. త్వరలోనే తిరుపతిలో బ్రాంచ్ ఏర్పాటు చేయబోతున్న విషయాన్ని ఆర్పి వెల్లడించారు. అయితే నవంబర్ 19వ తేదీ ఉదయం 10 గంటలకు ఈ రెస్టారెంట్ ప్రారంభం కాబోతుందని చెప్పారు.


ఈ రెస్టారెంట్ ప్రారంభోత్సవాన్ని ప్రముఖ నటి మెహరీన్ చేతుల మీదుగా చేయబోతున్నట్లు కిరాక్ ఆర్పీ వెల్లడించారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారేసరికి నెటిజన్స్ అంతా ఆర్పీకి విషెస్ చెప్తున్నారు. జబర్దస్త్ నుంచి బయటకు వచ్చాక మల్లెమాల సంస్థ గురించి ప్రతీ ఇంటర్వ్యూలో నెగటివ్ గా మాట్లాడేసరికి బుల్లితెర షోస్ లో ఆర్పీ పెద్దగా క్లిక్ కాకపోయేసరికి బుల్లితెరకు పూర్తిగా దూరమైపోయాడు.

ఇక నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసును జనాల్లోకి తీసుకెళ్లడానికి తన బ్రాంచెస్ ని ఇంకా ఇంకా ఎక్స్టెండ్ చేస్తున్నాడు అలాగే ఆ రెస్టారెంట్స్ లో మంచి చెఫ్స్ ని పెట్టి ఈ పులుసును ప్రిపేర్ చేయిస్తున్నాడు. ఇక బుల్లితెర, వెండితెర నుంచి చాలామంది కూడా ఆర్పీ రెస్టారెంట్ లో చేపల పులుసును టేస్ట్ చేసి అందరూ మంచి రేటింగ్స్ ఐతే ఇచ్చారు. బుల్లితెర మీద ఉన్న చాల మంది కూడా అటు డైరెక్టర్స్ గా రాణిస్తూ మరో వైపు హీరోస్ గా దూసుకుపోతూ ఇంకో వైపు ఫుడ్ బిజినెస్ లాంటివి పెట్టి రన్ చేస్తూ నాలుగు చేతులా సంపాదిస్తున్నారు.


Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.