English | Telugu

ఈ షోకి కూడా ఆ జడ్జిస్సేనా...బోరింగ్...


నిన్న గాక మొన్న బీబీ జోడి ఇలా పూర్తి చేసుకుందో లేదో "నీతోనే డాన్స్" అనే మరో డాన్స్ షో స్టార్ట్ కావడానికి సిద్ధమైపోయింది. బీబీ జోడిలో అందరూ బీబీ హౌస్ లో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్స్ ని తీసుకొచ్చారు. కానీ ఈ "నీతోనే డాన్స్" షోకి మాత్రం సీరియల్ యాక్టర్స్ ని, జబర్దస్త్ కమెడియన్స్ ని తీసుకొచ్చారు. ఇక బీబీ జోడి జడ్జెస్ టీం మాత్రం నిను వీడని నీడను నేనే అన్నట్టుగా ఈ షోకి కూడా కలిసికట్టుగా వచ్చేసారు.. వాళ్ళే అలనాటి అందాల సీనియర్ నటి రాధ, రాను రాను అంటూ తెలుగు ఆడియన్స్ గుండెల్లో ఉండిపోయిన సదా అలాగే తరుణ్ మాస్టర్. ఇక హోస్ట్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు..ఆదివారం రాత్రి 9 గంటలకు గ్రాండ్ గా లాంఛ్ కాబోతోంది ఈ షో.

ఇక ఇందులో నిఖిల్ - కావ్య, పవన్-అంజలి, అమర్‌దీప్- తేజస్విని, సందీప్- జ్యోతిరాజ్, శివకుమార్- ప్రియాంకా, నటరాజ్-నీతూ, యాదమ్మ రాజు-స్టెల్లా, సాగర్- దీపా జోడీలు స్టెప్పులేశారు. ఈ షో లాంఛింగ్ కి "టక్కర్" నుంచి హీరో సిద్దార్థ్ ఒక అమ్మాయిని వెంటబెట్టుకొచ్చాడు. "పక్కన ఉన్న అమ్మాయి ఎవరు" అని శ్రీముఖి సిద్దార్థ్ ని అడిగింది. "చూడండి నేను మీ ప్రోగ్రాంకి వచ్చాను...మా ఊర్లో అదితి దేవోభవ అంటారు కదా" అనేసరికి డాన్సర్స్ అంతా గట్టిగా అరిచారు. "నేను వదిలిపెట్టనుగా" అని రాధ అనేసరికి "పెట్టరుగా" అంది కొంటెగా శ్రీముఖి. ఇక ప్రోమో ఎండింగ్ లో నీతోనే డాన్స్ అంటూ రాధ ఒక మత్తైన చూపును ఆడియన్స్ మీదకు విసిరేసింది. ఇక ఈ ప్రోమోని చూసిన నెటిజన్స్ "సేమ్ బీబీ జోడి, జడ్జెస్ ని మార్చి ఉంటే బాగుండేదేమో...బోరింగ్ జడ్జెస్" అంటూ కామెంట్స్ పెట్టారు. ఈ జడ్జెస్ ని చూసేసరికి ప్రతీ ఒక్కరూ బీబీ జోడి అందుకునే అవకాశం కూడా ఉంది. ఇక సరికొత్తగా స్టార్ట్ అవుతున్న ఈ మ్యూజికల్ డాన్స్ షోలో ఎవరెవరు ఎలా చేస్తారో తెలియాలి అంటే నెక్స్ట్ వీక్ నుంచి ఈ షో ఫాలో కావాల్సిందే.


Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.