English | Telugu

పెళ్లి గురించి క్లారిటీ ఎప్పుడొస్తుంది.. ఏంటి మీకు లవ్ స్టోరీ ఉందా?


ఫామిలీ నంబర్ 1 నెక్స్ట్ సండే ప్రసారం కాబోయే ఎపిసోడ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షోకి గెస్ట్ గా నవదీప్ వచ్చాడు. ఇక రాగానే హోస్ట్ రవికి కో-హోస్ట్ గా చేస్తున్న రౌడీ రోహిణి వచ్చి అల్లరల్లరి చేసి పారేసింది. "దీప్..దీప్ నువ్వంటే నా దిల్లో డిబ్ డిబ్" అంటూ కామెడీ చేసేసరికి అందరూ నవ్వేశారు. వెంటనే రోహిణి నవదీప్ నడిచిన చందమామ మూవీలో "ముక్కుపై ముద్దు పెట్టు" అని పాట పాడింది.

దానికి నవదీప్ నవ్వుతూ " ఈ పాట పడితే కాజల్ గుర్తొస్తుంది" అన్నాడు. ఇక తర్వాత ఈ షోలో పార్టిసిపేట్ చేస్తున్న రియల్ కపుల్స్ కొంతమంది నవదీప్ ని కొన్ని ప్రశ్నలు వేశారు. సీద్విష్ణు కపుల్ లేచి " పెళ్లి గురించి ఎంత క్లారిటీ రావాలి మీరు పెళ్లి చేసుకోవాలంటే" అని అడిగారు తర్వాత యాంకర్ మృదుల వచ్చి "ఇంట్లో ఎవరూ లేనప్పుడు హూ ఆర్ యు" అని అడిగింది. ఈ ప్రశ్నలన్నింటినీ కూడా చాలా సీరియస్ గా విన్నాడు నవదీప్.

తర్వాత హోస్ట్ రవి వచ్చి "నవదీప్ లైఫ్ లో లవ్ స్టోరీ ఉందా " అని అడిగాడు "ఎందుకు లేదు గురు" అని అడిగేసరికి "ఉందా మీకు" అంటూ రోహిణి వచ్చి అడగడంతో వెంటనే "లేదా మీకు" అంటూ ఠకీమని కౌంటర్ పంచ్ ఇచ్చేసాడు నవదీప్. ఇక నవదీప్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్నాడు. ఆయన నటించిన ‘న్యూసెన్స్’ వెబ్ సిరీస్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఐతే నవదీప్ ఎక్కడికి వెళ్లినా ఎదురయ్యే ప్రశ్న పెళ్ళెప్పుడు అని..దానికి ఆన్సర్ చెప్తూనే ఉంటాడు. టైం వచ్చినప్పుడు అవుతుంది.కానీ లాక్‌డౌన్ టైమ్‌లో తనకు బ్రేకప్ అయ్యిందని, దాని నుంచి బయటపడేందుకు థెరపీకి కూడా వెళ్లినట్లు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు .ప్రస్తుతం తన మైండ్ అంతా కూడా ఇండస్ట్రీలో మంచి మంచి షోస్ చేయాలనీ ఉందంటున్నాడు నవదీప్.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.