English | Telugu

కేరళ షూటింగ్ లో ఉన్నప్పుడే నాన్న చనిపోయారు!

సిక్స్త్ సెన్స్ సీజన్ 6 షోకి "హిడింబ" టీం నుంచి నలుగురు సెలబ్రిటీస్ వచ్చారు. అశ్విన్ బాబు - విద్యురామన్, నందిత శ్వేతా -సాహితి వచ్చారు. ఫస్ట్ రౌండ్ ఆడాక సెకండ్ రౌండ్ లో ఎగ్ బ్రేక్ చేస్తున్నప్పుడు నందిత శ్వేతాకి వన్ సెకండ్ అని చెప్పి ఆపేసారు ఓంకార్." మీరెంత స్ట్రాంగ్..మీరు స్ట్రాంగ్ అవడానికి మెయిన్ రీజన్ ఏమిటి" అని అడిగాడు. "చిన్నప్పటినుంచి నా డెసిషన్స్ నేనే తీసుకునేదాన్ని. చాల స్ట్రగుల్స్ ఫేస్ చేసాను. ఇంకో విషయం చెప్పాలంటే హిడింబా షూటింగ్ టైంలో మా నాన్నకు ఒంట్లో బాలేదు. హాస్పిటల్ లో చేర్పించాను. అక్కడ నాన్నను చూసుకోవడం, మళ్ళీ షూట్ కి రావడం అలా చేసేదాన్ని. ప్రొడ్యూసర్ గారు అప్పటికి చాలా స్ట్రగుల్ అవుతున్నారు ఈ మూవీని ఎలా ఐనా కంప్లీట్ చేయాలని..షూటింగ్ కోసం కేరళ వెళ్లాల్సిందే అని చెప్పారు. ఎందుకంటే అది చేస్తేనే మూవీ పూర్తవుతుంది అనే పరిస్థితి వచ్చింది.

అప్పుడు హాస్పిటల్ కి, షూట్ కి తిరగలేక నాన్నకు రెస్ట్ తీసుకోమని చెప్పే షూటింగ్ కి వచ్చేసాను. అప్పుడు నా చేయి పట్టుకుని ఏడ్చారు. నాకు చాల బాధగా అనిపించింది. కానీ నాకు మూవీస్ అంటే ఎంత ఇష్టమో ఎంత కమిట్మెంట్ తో పని చేస్తానో ఆయనకు తెలుసు. అలా తప్పనిసరి పరిస్థితిలో షూటింగ్ కి కేరళ వెళ్ళా,. అక్కడ ఒక వారం రోజులు షూట్ ఉంది. అప్పుడు ఐదో రోజున నాన్న చనిపోయారనే వార్త వచ్చింది. ఐనా నేను వెళ్ళలేదు నా కమిట్మెంట్ ప్రకారం షూటింగ్ పూర్తి చేసుకుని వెళ్ళా. అప్పుడు నేను చాలా స్ట్రాంగ్ అన్న విషయం తెలిసింది. నా వల్ల ఎంత అయ్యిందో అంత వరకు చూసుకున్నాను. ఆయన హాస్పిటల్ లో ఉన్నప్పుడు హిడింబ మూవీ స్టోరీ కూడా వినిపించాను. మా మూవీ టీం మొత్తానికి ఆయన బ్లేసింగ్స్ ఎప్పుడూ ఉంటాయి" అని ఏడుస్తూ చెప్పింది నందిత శ్వేతా.. తర్వాత ఒక ఎగ్ బ్రేక్ చేసి లక్ష రూపాయలు గెలుచుకుంది.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.