English | Telugu

మణిరత్నంగారి ఇంటి బయట నెల రోజులు నిలబడ్డ నాగార్జున

గీతాంజలి మూవీ అంటే ఇష్టపడని తెలుగు ఆడియన్స్ లేరు. ఆ మూవీతో నాగార్జునకు సొంత ఇమేజ్ అనేది వచ్చింది. ఐతే ఆ మూవీ తెలుగులో రిలీజ్ కావడానికి రీజన్ నాగ్. ఆ విషయాలను జయమ్ము నిశ్చయమ్మురా షోలో జగపతి బాబుతో కలిసి షేర్ చేసుకున్నారు. "చాలా వేరియేషన్స్ తో మూవీస్ చెసావ్వు. చాలామంది ఆడియన్స్ కి అసలు కొంతకాలం నువ్వు చేసే మూవీస్ ఏంటో అర్ధమే కాలేదు. విక్రమ్, శివ, గీతాంజలి, అన్నమయ్య, హలో బ్రదర్, మనం..ఒకదానికి ఒకటి పొంతన లేని డిఫరెంట్ మూవీస్...ఏంటి ఆ విషయాలు" అని జగపతి బాబు అడిగేసరికి. "విక్రమ్ ఫస్ట్ ఫిలిం కానీ దాని గురించి నాకు అంత పెద్దగా తెలీదు. ఫస్ట్ ఫిలిం కదా నువ్వు చేస్తే బాగుంటుంది అని నాన్న గారు అన్నారు. మూవీ బాగా ఆడింది. కానీ అది కేవలం నాగేశ్వరరావు గారి అబ్బాయి చూద్దాము ఎలా చేస్తాడో అని ఆడియన్స్ చూసారు ఆడింది. అంతకు తప్పితే ఆ సినిమాలో ఏమీ లేదు. ఆ తర్వాత ఒక ఏడూ సినిమాలు చేసాను..వాళ్ళు చెప్తున్నారు ఏదో చేయమంటున్నారు.

ఆ మధ్యలో కలెక్టర్ గారి అబ్బాయి వచ్చింది నాన్నతో చేసాను. తర్వాత మజ్ను మూవీ వచ్చింది దాసరి నారాయణరావు గారితో చేశాను. మజ్ను అనే మూవీ నాకు బ్రేక్ ఇచ్చింది. నాలో నటుడు ఉన్నాడు అని ఆడియన్స్ కి తెలిసింది. మాస్ అండ్ కమర్షియల్ మూవీ ఆఖరి పోరాటం నాకు బ్రేక్ ఇచ్చింది. ఆ మూవీ అంటే రాఘవేంద్ర రావు గారు శ్రీదేవి గారు మాత్రమే కనిపిస్తారు. నేను ఒక బొమ్మలా ఉన్నాను అంతే. నేను చేసేవే నాకు నచ్చట్లేదు అప్పటివరకు. అప్పుడు నేను మణిరత్నం గారి వెనక పడ్డాను. ఆయన తీసిన మౌన రాగం చూసా..ఆయన ఆలోచనలు నాకు సూట్ అవుతాయి అనిపించి చెన్నైలో ఆయన వెనక పడడం స్టార్ట్ చేశాను. ఉదయం 6 గంటలకు వాకింగ్ కి వెళ్తారు అని తెలిసి అంతకు ముందే నేను ఆయన ఇంటి బయటకు నిలబడేవాడిని. ఆయనతో కలిసి పది నిమిషాలు వాక్ చేసేవాడిని. తరువాత ఆయన టెన్నిస్ కి వెళ్తున్నా అని చెప్పి వెళ్ళిపోయేవారు. తర్వాత ఆయన్ని కన్విన్స్ చేశా అలా గీతాంజలి మూవీ బయటకు వచ్చింది. ఐతే ఆయన తమిళ్ లో చేస్తాను అన్నారు ముందు. ఐతే మీకు ఎలాగో తమిళ్ లో మార్కెట్ ఉంది. తెలుగులో చేసి మార్కెట్ పెంచుకోండి అని ఐడియా ఇచ్చాను. అలా ఆయనకు విపరీతమైన మార్కెట్ పెరిగింది. నాకు హిట్ వచ్చింది." అని చెప్పారు నాగార్జున.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.