English | Telugu

శేఖర్ మాస్టర్ మీద నాగబాబు ఫైర్


"ఈ దీపావళికి మాస్ జాతర" రీసెంట్ ప్రోమో ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంది. ఇక ఇందులో అందాల పోటీలు కూడా పెట్టారు. ప్రకృతి కంభం, నైనికా వచ్చి స్టేజిని దడదడలాడించారు. ప్రకృతి ఐతే లంగా వోణిలో అచ్చ తెలుగు ఆడపిల్లలా వచ్చి స్టేజి మీద రాంప్ వాక్ చేసింది. "ఈ రౌండ్ జడ్జెస్ కి అన్నమాట. మీ ఇద్దరి జడ్జెమెంట్ ఒకేలా ఉందా లేదా అనేది" అంటూ ప్రదీప్ అనౌన్స్ చేసాడు. ఇక ప్రకృతి ఐతే ఊపుకుంటూ, తిప్పుకుంటూ, హొయలు పోతూ రాంప్ వాక్ చేసింది.

ఇక తర్వాత నైనికా కూడా వచ్చి రాంప్ వాక్ చేసింది. తర్వాత శేఖర్ మాష్టర్ "ప్రకృతి 8 మార్క్స్. కాదు ఇంకోటి నడుముంది కదా అని మధ్యలో ఓ తిప్పేసుకోవడం కాదు. ఎంత వరకు తిప్పాలి ఎంత వరకు బాలన్స్ చేయాలి అనేది చూడాలి. నాగబాబు సర్ నమస్కారం చేసావ్. నాకు సెల్యూట్ కొడతావేంటి " అని అడిగాడు. "నన్నేదో పెద్దవాడిగా గుర్తించింది. నిన్ను యంగ్ బాయ్ గా గుర్తించింది ఆ అమ్మాయి." అని చెప్పారు నాగబాబు. "నన్ను కూడా పెద్దోడిలాగే గుర్తించొచ్చు కదా సర్" అని శేఖర్ మాష్టర్ అనేసరికి. "ఎందుకు నీకు రెండోదే కావాలి. నీకు ఏది కావాలో అదే ఇచ్చింది" అన్నారు నాగబాబు. నైనికాకి ఎన్ని మార్క్స్ ఇచ్చారో చెప్పాలి అంటూ ప్రదీప్ అడిగేసరికి "నైనికాకు ఐతే తన నడకలో క్యాట్ వాక్ తో పాటు సంప్రదాయం కనపడింది" అన్నాడు శేఖర్ మాష్టర్ మార్కులు గురించి చెప్పకపోయేసరికి "ఎంతిచ్చావో చెప్పేహే" అంటూ నాగబాబు కౌంటర్ వేశారు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.