English | Telugu

మా అమ్మే నాన్నలా నన్ను చూసుకుంది : గుప్పెడంత మనసు రిషి సర్

మదర్స్ డే స్పెషల్ గా "లవ్ యు అమ్మ" అనే షో త్వరలో స్టార్ మా ఆడియన్స్ కోసం రాబోతోంది. ఈ షోకి హోస్ట్స్ గా యాంకర్ రవి, విష్ణు ప్రియా వచ్చారు. "మన మొదటి ప్రేమ తన కౌగిలింత, మన మొదటి ముద్ద తన చేతి వంట..ఈరోజు ఈ స్టేజి అంతా అమ్మ ప్రేమతో నిండిపోతుంది" అంటూ ఇంట్రడక్షన్ ఇచ్చాడు రవి. ఈ షోకి గుప్పెడంత మనసు సీరియల్ హీరో ముకేశ్ గౌడ, జబర్దస్త్ కమెడియన్ ఇమ్మానుయేల్, బిగ్ బాస్ నుంచి ప్రేరణ, గౌతమ్ కృష్ణ, విజె సన్నీ, బ్రహ్మముడి కావ్య అలియాస్ దీపికా ఇలా చాలామంది వచ్చారు. ఇక ఇమ్మానుయేల్ వాళ్ళ అమ్మ ఐతే విష్ణు ప్రియాకి కౌంటర్ ఇచ్చింది. "విష్ణు ప్రియా మేము మా పిల్లలతో వచ్చాము.

నువ్వు మీ పిల్లలతో రాలేదే" అని అడిగేసరికి ఆమె నోరెళ్లబెట్టింది. ఆ తర్వాత రవి "అమ్మ పాడిన జోల పాత ఎంతమందికి గుర్తుంది" అని అడిగాడు. అప్పుడు విజె సన్నీ భుజం మీద తల పెట్టి పడుకున్న వాళ్ళ అమ్మకు జోల పాడాడు "నంది కొండా వాగుల్లోనా" అంటూ దాంతో వాళ్ళ అమ్మ షాకయ్యింది. "మా అమ్మ గనక నాకు జోల పాట పాడితే నేను నిద్రపోను మా అమ్మే నిద్రపోతుంది" అని చెప్పింది దీపికా. ఇక అందరికీ ఇష్టమైన నటుడు ముకేశ్ గౌడ అలియాస్ రిషి సర్ వచ్చి మాట్లాడాడు " మా నాన్న రెండేళ్లు బెడ్ మీదనే ఉన్నారు. ఆ తర్వాత పారలైజ్ అయ్యాక ఇంట్లోనే తిరుగుతూ ఉండేవాళ్ళు. ఐతే ఒక ఏజ్ కి వచ్చాక ఫాదర్ సపోర్ట్ అనేది అవసరం అవుతుంది. మా అమ్మే నన్ను మా నాన్నలా చూసుకుంది. నెటిజన్స్ ఇక ముకేశ్ గౌడాని చూసి ఫుల్ ఫిదా ఐపోతున్నారు. రిషి సర్ ని పిలిచినందుకు ధన్యవాదాలు అంటూ కామెంట్ చేస్తున్నారు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.