Read more!

English | Telugu

Guppedantha Manasu : మను తండ్రి ఎవరని అడిగిన మహేంద్ర.. తను నిజం చెప్పగలదా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -1032 లో.. అనుపమని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొని వస్తారు. మా ఇంటికి తీసుకొని వెళ్తానంటే మీ ఇంటికి తీసుకొని వచ్చారని ఏంజిల్ అనగానే.. మా రిషికి బాగోలేనప్పుడు నువ్వు ఇంటికి తీసుకొని వెళ్లి బాగా చూసుకున్నావ్ కదా.. ఇప్పుడు మీ అత్తయ్యని మేము బాగా చూసుకుంటామని ఏంజిల్ తో మహేంద్ర అంటాడు.

ఆ తర్వాత కార్ లో టాబ్లెట్స్ ఉన్నాయ్ తీసుకొని వస్తానంటూ ఏంజెల్ వెళ్తుంటే.. వద్దు మనం కాఫీ చేసి తీసుకొని వద్దామని, మనుని టాబ్లెట్ కోసం వెళ్ళమని వసుధార చెప్తుంది. మీరు అనుపమ మేడమ్ కోసం రూమ్ రెడీ చెయ్యండని మహేంద్రకి వసుధార చెప్పి పంపిస్తుంది.. ఆ తర్వాత అనుపమ ఒక్కతే ఉంటుంది. అపుడు మను టాబ్లెట్స్ తీసుకొని వచ్చి అనుపమకి ఇస్తాడు. ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చెయ్యండని అనుపమతో మను అనగానే.. అలాంటి అవసరం రాదని అనుపమ అంటుంది. అలా తను అనగానే మను కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మను వెళ్తు అనుపమ గురించి ఆలోచిస్తాడు. నేను అడిగిన దాంట్లో న్యాయం ఉంది కదా ఎందుకు మా అమ్మ అంత హర్ట్ అయింది. నన్ను దూరం పెడుతుంది. నేను అడిగిన దానికి సమాధానం చెప్తే సరిపోతుంది కదా అంటు మను బాధపడతాడు. మరొకవైపు కన్నకొడుకుని ఎందుకు దూరం పెడుతున్నావంటూ మహేంద్ర, వసుధార కలిసి అనుపమని అడుగుతారు. నేనేం చెప్పలేనని అనుపమ అంటు ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత వసుధార కాలేజీకు వెళదాం మావయ్య అని అనగానే.. నువ్వు వెళ్ళు నాకు వర్క్ ఉందని మహేంద్ర అంటాడు. కాసేపటికి ఈ రోజు అనుపమ నా ప్రశ్నలకి సమాధానం చెప్పి తీరాలని మహేంద్ర అనుకుంటాడు.

ఆ తర్వాత రాజీవ్, శైలేంద్రలు ఒక దగ్గర కలుసుకొని మను గురించి మాట్లాడుకుంటారు. మరొకవైపు ప్రతి విషయంలో మనుని అపార్థం చేసుకున్నాను.. ఒకసారి వెళ్లి మాట్లాడాలని వసుధార తన క్యాబిన్ కి వెళ్తుంది. ఈ రోజు మను సర్ రాలేదని ప్యూన్ చెప్తాడు. ఫోన్ చేస్తే మను ఫోన్ కలవదు. మరొకవైపు అనుపమ దగ్గరికి మహేంద్ర వచ్చి.. మను తండ్రి ఎవరని అడుగుతాడు. దాంతో అనుపమ షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.