English | Telugu

జూన్ 12 నుంచి  మా వారు మాష్టారు!

జీ తెలుగులో ప్రసారమయ్యే సీరియల్స్ తెలుగు ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటాయి. ఇందులో ప్రసారమయ్యే చాలా సీరియల్స్ కూడా టాప్ 10 లో నిలుస్తాయి...ఇప్పుడు మరో కొత్త సీరియల్ ఈ ఛానల్ లో త్వరలో ప్రసారం కాబోతోంది. అదే "మా వారు మాష్టారు" జూన్ 12 నుంచి ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 7.30 గంటలకు ప్రసారం కావడానికి రెడీ ఐపోయింది. "అమ్మ ఆశయం కోసం ఆడిన అబద్ధం.. అగాధంలా మారితే.?" అనే టైటిల్ తో ఈ స్టోరీ స్టార్ట్ అవుతుంది. హీరోయిన్ శ్రీవిద్యకు చదువు అంటే ఎంతో ఇష్టం.

కానీ వాళ్ళ అమ్మ చనిపోవడం వలన ఆమె చదువుకోలేకపోతుంది. ఎలాగైనా పెద్ద చదువులు చదవాలని ఆశ పడుతుంది. చదివించే వాడి కంటే చదువు చెప్పే వాడు భర్తగా వస్తే తన కల నెరవేరుతుంది అని ఆశపడుతోంది. అందుకే ఎలాగైనా ఒక టీచర్ ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. తన కోరిక నెరవాలి అంటే తనకు గణపతి మాష్టర్ తగిన వాడు అని నమ్ముతుంది. ఐతే గణపతి తండ్రి ఒక టీచర్. తన కొడుకు కూడా అలాగే టీచర్ కావాలని ఆశ పడుతుంది గణపతి తల్లి.

కొన్ని కారణాల వలన తాను టీచర్ ని అంటూ తల్లికి అబద్దం చెప్తాడు గణపతి. కానీ గణపతి స్కూల్ లో ప్యూన్ అన్న విషయం తెలీదు. గణపతి చెప్పిన అబద్ధంతో అతని జీవితం ఎలా మలుపు తిరుగుతుంది ? శ్రీవిద్య గణపతి గురించిన నిజం తెలుసుకుని ఏం చేస్తుంది ? కొడుకు టీచర్ అని సంతోషపడే పార్వతికి నిజం తెలిసిందా ? ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాలను తెలుసుకోవాలంటే "మావారు మాస్టారు", సీరియల్ ని జీ తెలుగులో చూడాల్సిందే. ఈ కొత్త సీరియల్ పట్టాలెక్కేసరికి మిగతా సీరియల్స్ ప్రసార సమయాల్లో మార్పులు జరిగాయి. ఇకనుంచి మిఠాయికొట్టు చిట్టెమ్మ మధ్యాహ్నం 12 గంటలకు, రాధకు నీవేరా ప్రాణం మధ్యాహ్నం 3 గంటలకు ప్రసారం అవుతాయి.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.