English | Telugu

రేపే బిగ్ బాస్-5 ప్రారంభం.. కంటెస్టెంట్స్ పైనల్ లిస్ట్ ఇదే!!

బుల్లితెరపై బిగ్ బాస్ షో మరోసారి సందడి చేయబోతోంది. బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 5 ఆదివారం ప్రారంభం కానుంది. ఈ సీజన్ కు కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు. అయితే ఈసారి హౌస్ లోకి వెళ్ళే కంటెస్టెంట్స్‌ ఎవరా అని గత కొంతకాలంగా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రేపటి నుంచి షో ప్రారంభం కానున్న నేపథ్యంలో సీజ‌న్ 5లో పాల్గొన‌బోయే కంటెస్టెంట్స్ వీరేనంటూ సోషల్ మీడియాలో ఓ లిస్టు వైరల్ అవుతుంది.

బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 5లో పాల్గొన‌బోయే కంటెస్టెంట్స్ వీరేనంటూ ఓ లిస్టు చక్కర్లు కొడుతోంది. యాంకర్ రవి, యానీ మాస్టర్, నటరాజ్ మాస్టర్, యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్, యూట్యూబర్ సరయు, నటి శ్వేతా వ‌ర్మ, సీరియల్ నటి ప్రియ, ల‌హ‌రి, ఉమా దేవి, సీరియ‌ల్ నటుడు మాన‌స్‌, రేడియో జాకీ కాజల్, సింగ‌ర్ శ్రీరామ‌చంద్ర‌, యాక్ట‌ర్ విశ్వ పేర్లు లిస్టులో ఉన్నాయి. ఈ లిస్టు నిజమో కాదో అనేది రేపు తేలనుంది.

బిగ్ బాస్ షో తెలుగు మొదటి నాలుగు సీజన్లు బుల్లితెర ప్రేక్షకులను అలరించాయి. మరి ఐదో సీజన్ ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో చూడాలి.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.