English | Telugu

స్వప్న జ్ఞాపకాలని కాల్చేసిన కృష్ణమూర్తి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్‌-73లో.. కనకం‌ ఇంటికి వెళ్ళివచ్చిన అపర్ణ.. ‌అక్కడ తనకి జరిగిన అవమానం గురించి, రాజ్ మాట్లాడిన విధానం గురించి సీతారామయ్య మరియు ఇతర కుటుంబ సభ్యులతో చెప్తూ బాధపడుతుంది. రాజ్ ని మార్చేసారని.. దీనికి ఎలా సపోర్ట్ చేస్తారని వాళ్ళ అత్తయ్యని అడుగుతుంది అపర్ణ. కావ్య‌ నువ్వు ఇక్కడికి వచ్చాక నిన్ను ఏం చేస్తానో చూడని తన మనసులో అనుకుంటుంది అపర్ణ.

మరోవైపు కనకం దగ్గరికి వెళ్ళి తన గురించి చెప్తే తను అర్థం చేసుకుంటుందని భావించిన స్వప్న వాళ్ళింటికి వెళ్తుంది‌. ఎవరైనా చూస్తారేమోనని దొంగచాటుగా వెళ్ళగా.. వాళ్ళ చెల్లి కావ్య చూస్తుంది.. కలా నిజమా అని కావ్య కనులు మూసి తెరిచేలోగా దాక్కుంటుంది స్వప్న. ఆ తర్వాత మెల్లిగా ఇంట్లోకి వస్తుంది స్వప్న. తన జ్లాపకాలను అన్నింటిని పడేయడానికి ఇంట్లో ఒక మూలన పడేయడంతో అవి చూసిన స్వప్న ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత కనకం నిద్రపట్టట్లేదని సోఫాలోకి వస్తుంది. ఏమైంది కనకం పడుకోకుండా ఇలా వచ్చావేంటని కృష్ణమూర్తి అడుగగా.. ఆ సచ్చిన స్వప్న వచ్చినట్టుగా కల వచ్చిందని కనకం అంటుంది. ఆ పాపిష్టి దానిని ఎందుకు తల్చుకున్నావని కృష్ణమూర్తి అంటాడు. పక్కనే దాక్కున్న స్వప్న ఈ మాటలు విని.. వీళ్ళు నన్ను ఇంతలా అసహ్యించుకుంటున్నారా అనుకొని బాధపడుతుంది. ఆ తర్వాత ఇంట్లోని స్వప్న వస్తువులను, ఫోటోని చూసిన కృష్ణమూర్తి.. వాటిని బయటకు తీసుకెళ్ళి కిరోసిన్ పోసి కాల్చేస్తాడు. దూరం నుండి అది చూస్తూ స్వప్న ఏడుస్తుంది.

కాసేపటికి రాజ్ గదిలోకి వెళ్ళిన కావ్య.. గడియ పెట్టి రాజ్ దగ్గరగా వస్తుంది. అలా కావ్య రావడం చూసి‌న రాజ్.. భాయపడుతూ.. ఏయ్ ఏంటి.. ఆ గడియ ఎందుకు పెట్టావ్? ఏం చేయాలనుకుంటున్నావ్? ఆ పప్పులేం నా దగ్గర ఉడకవని రాజ్ అంటాడు. మీరు సౌండ్ వస్తుందని ఫ్యాన్ ఆపారు కదా విసరడానికి విసనకర్ర తీసుకొచ్చానని కావ్య అంటుంది. కాసేపు విసిరాక రాజ్ పడుకుంటాడు. కావ్య నేలమీద పడుకుంటుంది. కాసేపటికి రాజ్ లేచి చూస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.