English | Telugu

Krishna Mukunda Murari : మురారికి యాక్సిడెంట్.. మీరా గురించి భవాని ఎంక్వైరీ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -487 లో... కృష్ణ ఉదయమే తులసికోటకి పూజ చేస్తుంది. మురారి ఎక్కడున్నాడో తెలిసిలే చేయమని తన కష్టాలు దూరమవ్వాలని వేడుకుంటుంది. మరోవైపు మీరా గురించి ఎంక్వైరీ చేయడానికి భవాని తనని తీసుకొచ్చిన ప్లేస్ కి వెళ్తుంది.

అక్కడే మురారి వొంటికి గాయాలతో కట్లతో ఉంటాడు. ఇక కొద్దిలో మురారిని భవాని చూస్తుందనగా.. ముకుంద అక్కడే మురారికి కాపాలగా ఉంచిన ఒకావిడ మేడమ్ అని పిలుస్తుంది. మీరా లేదా అని భవాని ఆవిడని అడుగగా.. లేదని, ఎవరో గొప్పింటి వాళ్ళు తీసుకెళ్ళారని, తను అనాథ అని, అందరితో ఇట్టే కలిసిపోయేదని భవానీతో మీరా గురించి మంచిగా చెప్తుంది. ఇక భవాని అది నమ్మేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. మరోవైపు మురారి దగ్గరికి మీరా వస్తుంది. రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగి పడి ఉంటే నేనే కాపాడి తీసుకొచ్చాను లేదంటే ప్రాణాలతో ఉండేవాడివా అంటుంది. నువ్వు నన్ను ఎప్పుడు అర్థం చేసుకున్నావ్. నన్ను నా ప్రేమని అర్థం చేసుకుని ఉంటే ఎప్పుడో కృష్ణని వదిలేసి నాకోసం వచ్చేవాడివి అనేసరికి మురారి ఆవేశంగా.. ముకుంద అంటాడు. సరోగసి నిజంగానే జరిగింది కదా. కృష్ణకి కడుపు వచ్చింది అబద్ధం చెప్పావు కదా అలాగే ఇంకొక అబద్ధం చెప్పు. ముకుంద నా వల్లే తల్లి అయ్యింది అది నీకు చెప్తే తట్టుకోలేవని సరోగసి అని చిన్న నాటకం ఆడానని చెప్పు కావాలంటే డాక్టర్ వైదేహితో చెప్పిస్తాను. ఇలా చెప్తే కృష్ణ నిన్ను అసహ్యించుకుని వెళ్లిపోతుందని అంటుంది. నీ బొందలాగా ఉంది ఐడియా నేను కదల్లేక వదిలిపెడుతున్నా లేదంటే అని మురారి కోపంగా అంటాడు. నువ్వు నన్ను ఏం చేయలేవు ఎందుకంటే నీ బిడ్డ నా కడుపులో ఉంది కదా. నేను చెప్పినట్టు వింటే అందరం సేఫ్ గా ఉంటాం. లేదంటే కృష్ణ కూడా ఉండదు. నా కడుపులో నీ బిడ్డ కూడా ఉండదని వార్నింగ్ ఇస్తుంది.

అప్పుడే భవాని ఇంటికి రాగా.. రేవతి, మధు వాళ్ళ అమ్మ, మధు తన దగ్గరికి వస్తారు. ఎక్కడికెళ్ళారని రేవతి అడుగగా.. మీరా ఎలాంటిదో తెలుసుకుందామని వెళ్ళానని భవాని అంటుంది. మీరా గురించి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఏముందని మధు అడుగుతాడు. కృష్ణని నమ్మకుండా తన గురించి ఎంక్వైరీ చేయడం కరెక్ట్ కాదని అంటాడు. మీరా తల్లి అయ్యింది.. కారణం ఎవరంటే మురారి అంటుంది. వాడిని అడుగుదామంటే ఆ క్షణం నుంచి మురారి ఏమైపోయాడో తెలియడం లేదని భవాని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.