English | Telugu

మురారి లేడనే విషయం కృష్ణకి తెలియనుందా.. ప్రభాకర్ ఏం చేయనున్నాడు?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -294 లో.. ప్రభాకర్ ఫోన్ చెయ్యగానే మధు బయటకు వచ్చి ఎందుకు వచ్చావని అడుగుతాడు. మురారి ఎక్కడ ఉన్నాడు? లోపల ఉన్నాడా? అని ప్రభాకర్ అడగ్గానే.. లేదు మామయ్య అంటూ మధు జరిగింది మొత్తం చెప్తాడు. మురారి చనిపోయాడు మామయ్య అని మధు చెప్పగానే ప్రభాకర్ షాక్ అవుతాడు.

ఆ తర్వాత ఇంట్లో వాళ్ళు అసలేం జరిగింది? కృష్ణ ఎక్కడ ఉందని, కృష్ణపై చాలా కోపంగా ఉన్నారని మధు చెప్తాడు. కృష్ణ హాస్పిటల్ లో ఉందని చెప్తే మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుందని కృష్ణని మీరే ఇంటి నుండి పంపించేశారు కదా అని ప్రభాకర్ అంటాడు. ఆ తర్వాత ప్రభాకర్ బాధగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అసలు ఈ విషయం కృష్ణకి ఎలా చెప్పాలి అని ప్రభాకర్ అనుకుంటాడు. అలాగే అనుకుంటూ ప్రభాకర్ హాస్పిటల్ కి వస్తాడు. ఏమైంది అల్లుడి జాడ దొరికిందా అని శకుంతల అడుగుతుంది. ప్రభాకర్ ఏం చెప్పలేక సైలెంట్ గా ఉంటాడు. అయినా శకుంతల మళ్ళీ మళ్ళీ అడిగేసరికి ప్రభాకర్ మధు చెప్పింది మొత్తం శకుంతలకి చెప్తాడు. శకుంతల ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఈ విషయం మన కృష్ణకి తెలియవద్దని ఇద్దరు అనుకుంటారు. కాసేపటికి ఏసీపీ సర్ ఎక్కడ ఉన్నారో, అయినా చిన్నాన్న వెళ్ళాడు కదా, ఎలాగైనా ఏసీపీ సర్ ని తీసుకొని వస్తాడని కృష్ణ అనుకుంటుంది. అప్పుడే ప్రభాకర్, శకుంతల ఇద్దరు వస్తారు. ఏసీపీ సర్ గురించి తెలిసిందా అని కృష్ణ అడుగుతుంది. కాసేపటికి డాక్టర్ దగ్గరికి వచ్చి చెకప్ చేస్తుంది.

ముకుంద వాళ్ళ అన్నయ్య ముకుందకి ఫోన్ చేసి మురారి గురించి అప్డేట్ ఇస్తుంటాడు. మరొకవైపు కృష్ణ హాస్పిటల్ కి వచ్చి మురారి గురించి చూస్తుంది. మురారి గురించి తన చిన్నాన్న, పిన్నికి చెప్తుంటుంది. అప్పుడే ముకుంద వాళ్ళ అన్నయ్య.. కృష్ణ ముందు నుండి మురారిని తీసుకొని వెళ్తాడు. నాకు ఎందుకో ఏసీపీ సర్ ఇక్కడే ఉన్నట్లు అనిపిస్తుందని శకుంతలతో కృష్ణ చెప్తుంది. మరొక వైపు ముకుంద వాళ్ళ అన్నయ్య పరిమళతో మురారి ట్రీట్ మెంట్ గురించి మాట్లాడుతాడు. పరిమళకి మురారి అన్న విషయం తెలియదు. కృష్ణ హాస్పిటల్ లో మురారి గురించి వెతుకుతుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.