English | Telugu

మహంకాళి భోనాల జాతరలో కృష్ణ ముకుంద మురారి, మల్లి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -208 లో.. మధు, అలేఖ్య ఇద్దరు కలిసి ముకుంద, మురారిలు కలిసి ఉన్న ఫోటోలని భవానికి చూపించడానికి వెళ్తుండగా రేవతి చూసి ఏంటని అడుగగా.. వాళ్ళిద్దరి ఫోటోలు చూపిస్తాడు మధు. దాంతో వాళ్ళిద్దరిని పక్కకి తీసుకెళ్ళి.. "ముకుంద మురారీల ప్రేమ గతం.. ఈ విషయం మీకన్నా ముందే నాకు తెలుసు. ఈ విషయం ఎవరికి తెలియకూడదు. ముఖ్యంగా భవాని అక్కయ్యకి తెలియకూడదు" అని మధు, అలేఖ్యలతో రేవతి అంటుంది. దాంతో ఈ విషయం ఎవరికి చెప్పనని రేవతికి మధు మాటిస్తాడు.

ఆ తర్వాత కృష్ణ, మురారి కలిసి భోనాల కోసం ఏర్పాట్లు చేస్తుంటారు‌. తన ప్రేమ దక్కాలని మొక్కుకొని మురారి కోసం ఒక ప్రేమలేఖ రాస్తుంది కృష్ణ. దానిని తన కొంగుముడికి కట్టుకొని భోనం దగ్గరికి వెళ్తుంది. అక్కడ భవాని అందరూ కలిసి భోనాలు ఎత్తుకొని ఇంటి నుండి మహంకాళి టెంపుల్ కి వెళ్తారు. మురారి ఫ్యామిలీతో కలిసి మహంకాళి భోనాల దగ్గరికి వస్తాడు. అయితే అదే సమయంలో మురారికి గౌతమ్ నుండి కాల్ వస్తుంది. ఏంటి గౌతమ్ చాలా రోజులకి కాల్ చేసావ్? స్వప్న తో నీ పెళ్ళి ఫిక్స్ అయిందా? కంగ్రాట్స్ ఆ విషయం చెప్పడానికే కాల్ చేసావా అని మురారి అడుగుతాడు. స్వప్న ఒక కార్ యాక్సిడెంట్ లో చనిపోయిందని, యాక్సిడెంట్ చేసింది అరవింద్ అని చెప్తాడు గౌతమ్. అవునా మరి అతనికి శిక్ష పడిందా అని మురారి అడుగగా.. లేదు అతను డబ్బు పలుకుబడి ఉపయోగించి తప్పించుకున్నాడు. ఇప్పుడు మహంకాళి గుడికి ఫ్యామిలీతో వస్తున్నాడంట అని గౌతమ్ చెప్తాడు. సరే అయితే నువ్వు కూడా రా, నేను ఇక్కడే ఉన్నానని మురారి అనగా.. ఒక గంటలో అక్కడ ఉంటానని గౌతమ్ అంటాడు. మరోవైపు అరవింద్ వాళ్ళ ఫ్యామిలీని తీసుకెళ్ళి మహంకాళి టెంపుల్ కి వస్తుంటాడు.

అయితే టెంపుల్ లో కృష్ణ, ముకుంద, భవాని, రేవతి భోనాలతో ప్రదక్షిణలు చేస్తుండగా మధు వ్లాగ్ చేస్తుంటాడు. అదే సమయంలో భవాని ముందు మార్కులు కొట్టేయాలని కృష్ణ భోనాన్ని పట్టుకోకుండా నడిచి భవాని అత్తయ్య దగ్గర సభాష్ అనిపించుకుంటానని మురారీతో కృష్ణ చెప్పి.. భోనం పట్టుకోకుండా ముందుకు నడుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.