English | Telugu

Krishna Mukunda Murari:వారితో పాటు వీరికి కూడా శోభనమంట.. మరి ముకుంద ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -405 లో.. ముకుంద ఎందుకు ఇలా చేస్తుందని మురారి తన మాటలు గుర్తుకు చేసుకొని ఆలోచిస్తుంటాడు. మరొకవైపు ముకుంద ఆదర్శ్ ఇచ్చిన కాఫీని హ్యాపీగా తీసుకుందేంటి.. ఆదర్శ్ అంటే ఇష్టమేనా లేక నేను తప్పుగా ఆలోచిస్తున్ననా అని కృష్ణ అనుకుంటూ డిప్ థింకింగ్ లో ఉంటుంది‌. మురారి కూడా ఆలోచిస్తుంటాడు. కాసేపటికి మురారి దగ్గరకి కృష్ణ వచ్చి చెక్కెలిగింతలు చేస్తుంది. దాంతో మురారి కోపంగా.. ఎప్పుడు ఇలా పిచ్చిగా చేస్తావా అంటు సీరియస్ అవుతాడు.

ఆ తర్వాత మురారి తనపై సీరియస్ అవడంతో కృష్ణ ఏడుపు మొహం పెడుతుంది. అంతగా ఏం ఆలోచుస్తున్నారని కృష్ణ అడుగుతుంది. కృష్ణకి ముకుంద గురించి తెలిస్తే బాధపడుతుందని మురారి అనుకొని.. ఏం లేదు మన శోభనం గురించి ఆలోచిస్తున్నాని మురారి అంటాడు. ఎందుకు అంత సీరియస్ అయ్యారు. ఇంకొకసారి నాపై సీరియస్ అవ్వకండి అని కృష్ణ మురారికి కృష్ణ చెప్తుంది. మరొకవైపు మధు తన ఫ్రెండ్ తో ఫోన్ లో ఈ రోజు వస్తాను అన్ని అరేంజ్ మెంట్స్ చేయండి అని మాట్లాడుతుంటే.. అప్పుడే రేవతి వచ్చి.‌. ఏంటి రా వెళ్ళేది ఈ రోజు ముకంద, ఆదర్శ్ ల శోభనం ఏమైనా అవసరముంటే ఎవరు తీసుకొని వస్తారని రేవతి అంటుంది. ఈ శోభనం జరగదు. ముకుందకి ఇష్టం లేదని మధు అంటాడు. ఆ తర్వాత ముకుంద తన గదిలో మురారిని ఉహించుకొని రొమాంటిక్ గా డాన్స్ చేస్తుంటే.. అప్పుడే కృష్ణ వచ్చి ఏంటి ఇంత హుషారుగా ఉందని అనుకుంటుంది. ముకుంద నాకు హెల్ప్ చేస్తవా ఈ రోజు బ్రేక్ ఫాస్ట్ చేస్తావా అని కృష్ణ అనగానే.. సరే చేస్తాను అని ముకుంద వెళ్లి చేస్తుంది. ఆ తర్వాత ముకంద గురించి కృష్ణ ఆలోచిస్తుంటుంది. మురారి వచ్చి ఆనియన్ దోస చేసావా అని అడుగుతాడు. ముకుంద చేస్తుందని కృష్ణ చెప్పగానే.. తను ఎందుకు చేస్తుంది నువ్వు చెయ్ అనగానే తను ఎందుకు చెయ్యకూడదని కృష్ణ అంటుంది. నాకు ఇష్టమైంది ముకుంద చెయ్యడమేంటని మురారి కోపంగా ముకుంద దగ్గరికి వెళ్తాడు.

అక్కడికి వెళ్ళిన మురారిని.. ఆదర్శ్ ని ఇంట్లో నుండి పంపే ప్రయత్నం ఎంత వరకు వచ్చిందని ముకుంద అడుగుతుంది. అతన్ని పంపించి మనం ఒకటి అవుదామని మురారిపై ప్రేమని ముకుంద చెప్తుంటే మురారి ముకందపై చెయ్ లేపుతాడు. నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా అని మురారి అంటాడు. వాళ్ళ మాటలని కృష్ణ విని షాక్ అవుతుంది. తరువాయి భాగంలో కృష్ణ, మురారి ఇద్దరు కలిసి ముకుందకి కౌంటర్ ఇస్తారు. మీతో పాటు మా శోభనం కూడా ఈ రోజు జరుగుతుందని కృష్ణ, మురారి ఇద్దరు కలిసి ఇంట్లో వాళ్ళకి చెప్పగానే.. వీళ్ళు ప్లాన్ తోనే ఇదంతా చేస్తున్నారని ముకుంద అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.