English | Telugu

Krishna Mukunda Murari:వాళ్ళిద్దరు కలిసి అదర్శ్ ని ఒప్పించి ఇంటికి తీసుకురాగలరా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -373 లో.. కృష్ణ మురారి లు ఆదర్శ్ కోసం వెతుక్కుంటూ.. జమ్మూ కాశ్మీర్ వరకు వస్తారు. దార్లో ఒక దగ్గర టీ తాగడానికి ఆగుతారు. అక్కడ ఒక్కటే కప్ ఉండడం.. నువ్వు తాగు అంటే నువ్వు తాగు అని ఇద్దరు అనుకుంటారు. ఇక తింగరి కృష్ణ తనకున్న అతి తెలివి తో ఒక కప్ లో తను తాగేసి ఆ కప్ ని రివర్స్ చేసి మురారిని తాగమని చెప్తుంది. ఇద్దరు టీ తాగడం అయ్యాక మళ్ళీ ప్రయాణం మొదలు పెడుతారు.

ఆ తర్వాత మెహత చెప్పిన విలేజ్ దగ్గరికి వచ్చి.. దార్లో వెళ్తున్నా ఒక అతనికి ఆదర్శ్ ఫోటో చూపించి తెలుసా అని అడుగుతారు. తెలుసు అటు వైపే వెళ్తున్న చూపిస్తానంటు.. అతను కృష్ణ, మురారీల కార్ లో వెళ్తాడు. కాసేపటికి ఆదర్శ్ ఉన్న దగ్గరికి వస్తారు. ఆదర్శ కొంతమంది పిల్లలకి ట్రైనింగ్ ఇస్తుంటాడు. అప్పుడే కృష్ణ, మురారీలు దగ్గర వరకు వెళ్తారు. రూపం మారిన మురారీని ఆదర్శ్ గుర్తుపట్టడు. అలాగే కృష్ణ ఎవరో కూడా ఆదర్శ్ కి తెలియదు. ఎవరు మీరని ఆదర్శ్ అడుగుతాడు. మురారి అని కృష్ణ చెప్తుంది. ఆ తర్వాత కృష్ణ ఆదర్శ్ కి .. మురారిది ఏ పరిస్థితులో రూపం మారిందో అంత వివరిస్తుంది. అతనే మురారి అని తెలుసుకున్న ఆదర్శ్.‌ మురారిని హగ్ చేసుకొని ఎమోషనల్ అవుతాడు. అలా కాసేపటికి కృష్ణ నా భార్య అంటు మురారి పరిచయం చేస్తాడు. ఏంటి ముకుందని పెళ్లి చేసుకోలేదా అని ఆదర్శ్ తన మనసులో అనుకుంటాడు.

కాసేపటికి ఇక మనం ఇంటికి వెళదామని మురారి అనగానే..నేను రానని ఆదర్శ్ అంటాడు. ఇప్పుడు పరిస్థితులు అన్ని చక్కబడ్డాయ్. పెద్దమ్మ నీ కోసం ఎదురు చూస్తుందని మురారి అంటాడు. ముకుంద, మురారీతో ఫోన్ మాట్లాడిన విషయం గుర్తుకు చేసుకొని.. ఇప్పుడు ఇప్పుడే బాధని మర్చిపోవడానికి ట్రై చేస్తున్నానని ఆదర్శ్ అంటాడు. అదంతా మర్చిపోయి ఇంటికి వెళదామని కృష్ణ అంటుంది. నాకు అంత తెలుసని కృష్ణ చెప్తుంది. నీ మనసు లో ముకుంద ఉంది. ఇప్పుడు తను మారిపోయిందని మురారి చెప్తాడు. అవును మీ మనసులో ముకుందపై ప్రేమ అలాగే ఉందని కృష్ణ చెప్తుంది. కృష్ణ మురారీ ఇద్దరు కలసి కన్విన్స్ చేసి ఆదర్శ్ ని ఇంటికి తీసుకొని వెళ్తారా? లేదా .. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.