English | Telugu
మారుతీ నెక్స్ట్ మూవీలో పాట పాడే ఆఫర్ కొట్టేసిన కీర్తిభట్
Updated : Jun 21, 2022
తెలుగు ఆడియన్స్ కి కీర్తి భట్ అంటే ఎవరో తెలీదో కానీ భాను అంటే చాలు గుర్తు పట్టేస్తారు. ఎందుకంటే మానసిచ్చి చూడు సీరియల్ లో భాను పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది. కీర్తి. బెంగళూరులో పుట్టిన కీర్తికి చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా ఇష్టం. అందుకే యాక్టింగ్ లో కూడా శిక్షణ తీసుకుంది. చదువైపోయాకు కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెట్టి మూడు సీరియల్స్ చేసింది. ఐతే కొన్నేళ్ల క్రితం కీర్తి తన వాళ్ళను పోగొట్టుకుని ఒంటరిగా మిగిలిపోయింది. ఒక కారు ప్రమాదంలో కీర్తి తల్లితండ్రులతో పాటు అన్నయ్య, వదినను దూరం చేసుకుంది. కీర్తి కూడా ఇదే ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై కోమాలోకి వెళ్ళిపోయింది. కొన్నాళ్ళకు కోలుకుని మానసిచ్చి చూడు అనే సీరియల్ లో యాక్ట్ చేసింది. ఇటీవల ఫాథర్స్ డే సందర్భంగా స్టార్ మాలో ప్రసారమైన మొగుడ్స్ పెళ్లామ్స్ షోలో "వెలుగు, చీకటిలోన తోడై నిలిచే నాన్న అంటూ పాట పాడి " బాగా ఎమోషన్ అయ్యింది కీర్తి. పాట చాలా బాగా పాడిందంటూ రాశిఖన్నా, గోపీచంద్, మారుతి మెచ్చుకున్నారు.
మారుతి కూడా వాళ్ళ నాన్న గురుంచి ఈ షోలో చెప్పుకొచ్చారు. ఇక కీర్తి ఇన్వాల్వ్ అయ్యి ఇంత చక్కగా పాడినందుకు మారుతి తన నెక్స్ట్ మూవీలో ఒక సాంగ్ ని కీర్తితో పాడిస్తానంటూ మంచి ఆఫర్ కూడా ఇచ్చారు. "ఆడపిల్లలకు నాన్న అంటే చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా షూటింగ్ అయ్యాక ఇంటికి వెళ్లి తలుపు కొడితే నాన్న తలుపు తీస్తారేమో అని ఎదురు చూస్తుంటాను. వాళ్ళు రారని, లేరని తెలుసు కానీ చిన్న ఆశ ఉంది. పేరెంట్స్ లేకపోతె ఆ బాధ ఎలా ఉంటుంది నాకు తెలుసు. దయచేసి పేరెంట్స్ ఎవరూ బాధపెట్టొద్దు, వాళ్ళను బాగా చూసుకోండి ..ఉన్నంత వరకు జాగ్రత్తగా చూసుకోండి..ఈ రోజు నేను ఈ స్టేజి మీద ఉన్నాను అంటే అది మా నాన్న , స్టార్ మా వల్ల" అంటూ చెప్పుకొచ్చింది కీర్తి భట్.