English | Telugu

Nikhil lover kavyashree: నిఖిల్ తో కాకుండా వేరే అతడితో రొమాంటిక్ సాంగ్ చేసిన కావ్యశ్రీ!

కావ్య నువ్వేంటి ఇక్కడ.. ఏ నేను ఇక్కడ ఉండకూడదా.. ఎల్లోరా శిల్పాలు ఇక్కడ ఉండకూడదు కదా అనే డైలాగ్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. బిగ్ బాస్ సీజన్-8 విన్నర్ నిఖిల్ లవర్ కావ్యశ్రీ గురించి ఇప్పుడు ఓ‌ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది.

తాజాగా రిలీజ్ చేసిన దావత్ ప్రోమోలో‌ సుమతో పాటు రాజీవ్ కనకాల, సమీర్, హైపర్ ఆది ఇంకా కొంతమంది టీవీ యాక్టర్స్ వచ్చారు. ఇక ఇందులో కావ్యశ్రీ కూడా వచ్చింది. కావ్య ఓ సీరియల్ హీరోతో డ్యాన్స్ పెర్ఫామెన్స్ చేసింది. "హే రంగులే హే రంగులే" అనే పాటకి ఆ హీరోతో కలిసి రొమాంటిక్ పర్ఫామెన్స్ ఇచ్చింది. ఇది చూసి ప్రోమో కింద నిఖిల్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. నిఖిల్-కావ్యలను చూసిన కళ్లు ఇలా చూడలేకపోతున్నాయంటూ కామెంట్లు పెడుతున్నారు. అసలు ఆ హీరో ఎవడు? అంటూ కొశ్చన్ చేస్తున్నారు. అయితే ఆ హీరో ఈటీవీలో ప్రసారమవుతున్న 'గువ్వ గోరింక' సీరియల్ హీరో తేజస్ గౌడ (నందు). ఈ ధారావాహికలో కావ్య కూడా నటిస్తుంది. దీంతో వీళ్లిద్దరూ కలిసి ఇలా ఓ డ్యాన్స్ చేశారన్నమాట. నిజానికి గతంలో కూడా కావ్య.. ఈటీవీలో పలు షోలు చేసింది. కానీ అందులో నిఖిల్ కూడా వెంట వచ్చేవాడు. ఎప్పుడూ వీళ్లిద్దరే కలిసి పర్ఫామ్ చేసేవారు.. ఒకవేళ ఎవరైనా కావ్యతో కలిసి డ్యాన్స్ చేస్తానన్నా కూడా నిఖిల్ ఒప్పుకునేవాడు కాదు. అలాంటిది ఇప్పుడు కావ్య ఇలా వేరే వాళ్లతో పర్ఫామ్ చేసేసరికి నిఖిల్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

బిగ్ బాస్ సీజన్-8 కి నిఖిల్ వెళ్ళేముందే వారికి బ్రేకప్ అయ్యింది. ‌అయితే హౌస్ లోకి వెళ్ళాక నిఖిల్ లవ్ ఫెయిల్యూర్ ముసుగులో ఉన్నాడని, తను కావాలనే అలా చేస్తాడని కావ్యశ్రీ చాలాసార్లు చెప్పింది. అయితే నిఖిల్ ఫ్యాన్స్ మాత్రం కావ్యశ్రీని‌ తిడుతూ కామెంట్లు పెట్టేవారు. బయటకొచ్చాక నిఖిల్ చేసే పనులకి కావ్యశ్రీకి అసలు సంబంధమే లేదు. కానీ కావ్యశ్రీ-నిఖిల్ ల మధ్య ఇంకా ప్రేమ ఉందని కొందరు నమ్ముతున్నారు కానీ ఈ ప్రోమో చూసాక వారి మనస్సు మార్చుకుంటారు. అంత రొమాంటిక్ గా వేరే అతడితో కావ్యశ్రీ డ్యాన్స్ చేసింది.‌ ఇది ఇప్పుడు నిఖిల్ ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.