English | Telugu

Karthika Deepam2 : అవార్డు ఫంక్షన్ లో జ్యోత్స్న ఎత్తుగడ.. దీపకి షాకిచ్చిన కార్తీక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -362 లో..... బెస్ట్ రెస్టారెంట్ అవార్డు వచ్చినందుకు దీప వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. నాన్న రేపు అవార్డు ఫంక్షన్ కి ఈ డ్రెస్ వేసుకుంటానని శౌర్యా అంటుంది. రేపు మీరందరు ఎందుకు నేను ఒక్కడిని వెళ్తానని కార్తీక్ అంటాడు. మేమ్ కూడా వస్తామని అందరు అంటారు. రేపు అవార్డు అందుకునేది నేను కాదని ఎలా చెప్పాలని కార్తీక్ తన మనసు లో బాధపడతాడు.

మరుసటి రోజు ఉదయం అవార్డు ఫంక్షన్ కి జ్యోత్స్న వెళ్తుంది. తను కార్తీక్ ప్లేస్ లో కూర్చుంటుంది. అప్పుడే సత్యరాజ్ వచ్చి ఈ సీట్ కార్తీక్ ది అని అంటాడు. ఇది అవార్డు అందుకునే వాళ్ళదని సత్యరాజ్ అనగానే అవార్డు నేనే అందుకుంటున్నానని జ్యోత్స్న అంటుంది. అప్పుడే కార్తీక్ తన కుటుంబంతో వస్తాడు. జ్యోత్స్న అవార్డు అందుకునేది నేనే అంటుందని కార్తీక్ తో సత్యరాజ్ అంటాడు. అప్పుడే శివన్నారాయణ అక్కడికి వస్తాడు. ఇక్కడికి ఎందుకు వచ్చావ్ జ్యోత్స్న.. నా పరువు తియ్యడానికా అని జ్యోత్స్నని శివన్నారాయణ కోప్పడతాడు. బావపై ఉన్న హక్కులన్నీ మనకి మార్చబడ్డాయ్ ఇప్పుడు అవార్డు అందుకునేది నేనే అని అగ్రిమెంట్ చూపిస్తుంది. అక్కడున్న వాళ్ళకి ఏం అర్ధం కాదు.

కార్తీక్ కూడ సైలెంట్ గా ఉంటాడు. జ్యోత్స్న ఏం అంటుంది రా అని కాంచన అడుగుతుంది. నా కొడుకు గెలిచాడని ఓర్వలేక నువ్వు ఇలా మనవరాలిని పంపించావ్ కదా అని తన తండ్రి శివన్నారాయణతో కాంచన అంటుంది. ఆ తర్వాత కార్తీక్ స్టేజ్ పైకి వెళ్లి.. ఈ అవార్డు ఫంక్షన్ లో చిన్న మార్పు.. అవార్డు అందుకునేది నేను కాదు జ్యోత్స్న అని అనగానే దీప షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.