English | Telugu
Karthika Deepam2 : అనసూయని నిలదీసిన దీప.. తను నిజం చెప్పనుందా!
Updated : May 28, 2025
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -368 లో..... కార్తీక్ వెళ్తుంటే దీప వద్దని చెప్తుంది. ఎందుకు ఇదంతా చేస్తున్నారని దీప నిలదీస్తుంది. దాంతో దీపని ఆవేశంగా పక్కకి తీసుకొని వెళ్తాడు కార్తీక్. నువ్వు సుమిత్ర, దశరథ్ ల సొంత కూతురివి.. నువ్వే నా మరదలివి అని కార్తీక్ చెప్పగానే దీప షాక్ అవుతుంది. ఏంటి మీరు మాట్లాడేదని దీప అడుగుతుంది.
అవును దీప నేను చెప్పేది నిజం.. ఇదంతా దాస్ మావయ్య చెప్పాడని కార్తీక్ అంటాడు. ఆయనకే గతం గుర్తులేదు.. మీరు ఆయన చెప్పేది నమ్ముతున్నారా అని దీప అంటుంది. ఆయనకు అంతా తెలుసు.. అందుకే అయన ఎక్కడ నిజం బయట పెడతాడో అని దాస్ మావయ్యని కొట్టింది జ్యోత్స్న. మరి జ్యోత్స్న ఎవరని దీప అడుగుతుంది. దాస్ మావయ్య కూతురు జ్యోత్స్న. పారిజాతం ఇదంతా చేసిందని కార్తీక్ జరిగింది మొత్తం చెప్తాడు. ఇప్పుడు నా ముందు రెండు ఉన్నాయ్.. ఒకటి నిన్ను ఆ కుటుంబానికి దగ్గర చెయ్యడం.. రెండు జ్యోత్స్న నోటితోనే అన్ని నిజాలు చెప్పించాలని కార్తీక్ అంటాడు.
ఆ తర్వాత దీప కుబేర్ ఫోటో దగ్గరకి వచ్చి ఏడుస్తుంది. అనసూయ దగ్గరికి దీప వెళ్లి.. అత్తయ్య నేను నీకు ఎప్పటి నుండి తెలుసని అడుగుతుంది. చిన్నప్పటి నుండి అని అనసూయ అంటుంది. అమ్మకి పురుడు పొసేటప్పుడు ఎక్కడ ఉన్నవని దీప అడుగుతుంది. బయట ఉన్నానని అనసూయ కంగారుగా చెప్తుంది. అప్పుడే కుబేర్ ఫొటోని దీప తీసుకొని వచ్చి.. ఈ ఫోటోపై అనసూయ చెయ్ పెడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.