English | Telugu

సౌంద‌ర్య‌, ఆనంద‌రావు వృద్ధాశ్ర‌మం డ్రామా!

సుదీర్ఘ‌ కాలంగా స్టార్ మాలో ప్ర‌సారం అవుతున్న టాప్ సీరియ‌ల్‌ 'కార్తీక దీపం' మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. మంగ‌ళ‌వారం ఎపిసోడ్ విశేషాలు ఏంటో ఒక‌సారి చూద్దాం. హిమ అన్న మాట‌ల గురించి నిరుప‌మ్ ఆలోచిస్తూ వుంటాడు. ఇంత‌లో అక్క‌డికి స్వ‌ప్న వ‌స్తుంది. ఏం ఆలోచిస్తున్నావ‌ని అడుగుతుంది. "నేను గేమ్ గురించి ఆలోచించినా అది నీకు చెప్పాలా మమ్మీ" అంటాడు. దీంతో సీరియ‌స్ అయిన స్వ‌ప్న నీ పెళ్లికి అంగీక‌రించి త‌ప్పుచేశాన‌ని అంటుంది. ఆ మాట‌ల‌కు వెంట‌నే నిరుప‌మ్ సీరియ‌స్ అవుతాడు.

క‌ట్ చేస్తే.. శౌర్య‌ ద‌గ్గ‌రికి వెళ్లిన ఆనంద‌రావు భోజ‌నానికి ర‌మ్మ‌ని పిల‌వ‌గా "నాకు ఆక‌లిగా లేదు మీరు వెళ్లండి" అంటుంది. అదే త‌ర‌హాలో సౌంద‌ర్య‌కు హిమ చెప్ప‌డంతో ఆనంద‌రావు, సౌంద‌ర్య ఇద్ద‌రు క‌లిసి శౌర్య‌, హిమ‌ల గురించి ఆలోచిస్తూ వుంటారు. ఇలా కాద‌ని ఇద్ద‌రం క‌లిసి వృద్ధాశ్ర‌మానికి వెళ్లిపోతున్న‌ట్టుగా డ్రామా ఆడితే స‌రి అని ప్లాన్ చేస్తారు. అదే విష‌యాన్ని హిమ‌, శౌర్యల‌కు చెప్ప‌డంతో షాక్ అవుతారు. అయితే ఆ ఇద్ద‌రిని హిమ‌, శౌర్య వెళ్ల‌డానికి వీళ్లేద‌ని ఆపేస్తారు.

దీంతో "మీరు భోజ‌నం చేయ‌రు, మ‌మ్మ‌ల్ని చేయ‌నివ్వ‌రు" అని సౌందర్య అన‌డంతో "స‌రే మీరు చెప్పిన‌ట్టే చేస్తాం" అని హిమ‌, శౌర్య చెబుతారు. దీంతో అంతా క‌లిసి భోజ‌నం చేయ‌డానికి సంతోషంగా లోప‌లికి వెళ‌తారు. క‌ట్ చేస్తే.. నిరుప‌మ్ గురించి ఆలోచిస్తూ వుంటుంది శోభ‌. ఇంత‌లో బ్యాంక్ మేనేజ‌ర్ ఫోన్ చేస్తాడు. లోన్ క‌ట్ట‌క‌పోతే హాస్పిట‌ల్ ని సీజ్ చేస్తామ‌ని వార్నింగ్ ఇస్తాడు. దీంతో ఎలా చేయాలా? అని శోభ టెన్ష‌న్ ప‌డుతూ వుంటుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింద‌న్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.