English | Telugu

వంటలక్క మ్యానియా ఈజ్ బ్యాక్!


బుల్లితెరపై అత్యధిక రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్ 'కార్తీక దీపం' అనే విషయం అందరికి తెలిసిందే.. కాగా ఈ సీరియల్ శుభం కార్డుకి టైం రానే వచ్చింది. ఈ సీరియల్ ముగుస్తుండటంతో ప్రేక్షకులు నిరాశతో ఉన్నట్లు తెలుస్తోంది. వంటలక్క, డాక్టర్ బాబులని చాలా మిస్ అవుతామని.. ఇన్ని రోజులుగా వాళ్ళని మా ఇంట్లో వాళ్ళలాగా భావించామంటూ సోషల్ మీడియాలో అభిమానుల చేసిన పోస్ట్ లు వైరల్ అవుతున్నాయి. ఈ సీరియల్ కోసం కొంతమంది పూజలు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఈ సీరియల్ అంటే జనాల్లో ఎంత క్రేజ్ ఉందో తెలుస్తోంది.


అయితే ప్రేక్షకుల విన్నపం డైరెక్టర్ కి వినపడినట్లే ఉంది కాబోలు.. కార్తీక దీపం సీజన్-2 ఉంటుందని చెప్పినట్లు తెలుస్తోంది. ఇందులో కూడా డాక్టర్ బాబు, వంటలక్కలదే మెయిన్ రోల్ అంట.. ఇందుకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా స్టార్ట్ అయినట్లు సమాచారం. 'కార్తీక దీపం' ఈ టైటిల్ కలిసి రావడంతో అదే టైటిల్ తో ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పుడు ఎక్కడ చుసినా "వంటలక్క మ్యానియా ఈజ్ బ్యాక్" అనే ట్యాగ్ లతో సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కార్తీక దీపం సీజన్-2 ఉంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.