English | Telugu

‘రాధకు నీవేరా ప్రాణం’ త్వరలో కలుద్దాం

కార్తీకదీపం సీరియల్ కి, డాక్టర్ బాబుకి, తెలుగు ఆడియన్స్ ని విడదీయరాని అనుబంధం ఉంది. కార్తీక దీపం ఐపోయిన దగ్గర నుంచి రోజు డాక్టర్ బాబు, వంటలక్కను చూడక విసిగిపోయారు. అలాంటి తన ఫాన్స్ ని మళ్ళీ ఎంటర్టైన్ చేయడానికి డాక్టర్ బాబు త్వరలో మన ముందుకు రాబోతున్నాడు. కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యిందని డాక్టర్ బాబు అనౌన్స్ చేసాడు. ఇప్పటికే షూటింగ్ మొదలయ్యింది..త్వరలో కలుద్దాం అంటూ ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టాడు. త్వరలో డాక్టర్ బాబు కొత్త సీరియల్ రాబోతోంది అంటే ఫాన్స్ ఊరుకుంటారా... వెయిట్ చేస్తున్నాం త్వరగా రండి అంటూ మెసేజెస్ పెడుతున్నారు. కొత్త ప్రాజెక్ట్ పేరేమిటి అని అడిగేసరికి "రాధకు నీవేరా ప్రాణం" అని కామెంట్ చేసింది జీ తెలుగు. ఇందిలో పోలీస్ గా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.

'హిట్లర్ గారి పెళ్లాం' సీరియల్ ఫేమ్ గోమతి ప్రియ నిరుపమ్ కి జోడీగా నటిస్తోంది. నిరుపమ్ ఇప్పటివరకు ఎన్నో సీరియల్స్‌లో నటించాడు. చంద్రముఖి, ప్రేమ, కార్తీక దీపం ఇలా అనేక సీరియల్స్‌లో తన నటనతో ఆకట్టుకున్నాడు. 'కార్తీక దీపం' లో క్యారెక్టర్ బాగా హిట్ అవడంతో ఆయనకు మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఇక ఆయన ప్రొడక్షన్‌లో వస్తున్న 'పల్లకిలో పెళ్లికూతురు' సీరియల్ ఆడియన్స్‌ను అలరిస్తోంది. "రాధకు నీవెరా ప్రాణం" సీరియల్ డాక్టర్ బాబు ఏ రేంజ్ కి తీసుకెళ్లనుందో చూడాలి. "కార్తీక దీపం లాంటి మంచి కంటెంట్ ఉన్న సీరియల్స్ చేయండి...పోలీస్ ఐనా, డాక్టర్ ఐనా, కలెక్టర్ ఐనా ఏ క్యారెక్టర్ ఐనా నిరుపమ్ కే సూటవుతుంది..." అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.