English | Telugu

కంట‌త‌డి పెట్టిన `కార్తీక దీపం` న‌టి

బుల్లితెర‌పై మ‌హిళా లోకాన్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్న సీరియ‌ల్ `కార్తీక దీపం`. ఈ సీరియ‌ల్ ద్వారా వంట‌ల‌క్క పాత్ర‌లో న‌టించిన ప్రేమి విశ్వ‌నాథ్ సెల‌బ్రిటీగా మారిన విష‌యం తెలిసిందే. ఆ స్థాయిలో కాక‌పోయినా న‌టిగా పాపులారిటీని సొంతం చేసుకుంది మోనిత పాత్ర‌లో న‌టించిన క‌న్న‌డ న‌టి శోభా శెట్టి. ఈ సిరియ‌ల్‌లో నెగిటివ్ పాత్ర‌లో న‌టించి ఆక‌ట్టుకుంటున్న శోభాశెట్టి జీవితంలోనూ చాలా బాధ‌లు, క‌న్నీళ్లు.. వెక్కిరింపులు వున్నాయ‌ట‌.

ఇదే విష‌యాన్ని ఇటీవ‌ల ఓ టీవీ షోలో బ‌య‌ట‌పెట్టి క‌న్నీళ్లు పెట్టుకుంది. యాంక‌ర్ ప్ర‌దీప్ హోస్ట్‌గా జీ తెలుగులో నిర్వ‌హిస్తున్న రియాలిటీ షో `సూప‌ర్ క్వీన్‌`. వివిధ రంగాల్లో త‌మ ప్ర‌తిభ‌ని చాటుకుని సాధార‌ణ స్థాయి నుంచి అసాధార‌ణ వ్య‌క్తులుగా ఎదిగిన మ‌హిళ‌ల నేప‌థ్యంలో `సూప‌ర్ క్వీన్` షోని నిర్వ‌హిస్తున్నారు. ఈ షోలో పాల్గొన్న శోభాశెట్టి ఒక ద‌శ‌లో క‌నీసం వేసుకోవ‌డానికి చెప్పులు కూడా లేని దీన స్థితిని ఎదుర్కొన్నాన‌ని, చెప్పులు తెగిపోతే పిన్నీసు పెట్టుకుని 20 కిలోమీట‌ర్లు న‌డిచాన‌ని చెప్పి క‌న్నీళ్లు పెట్టుకోవ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది.

దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారింది. చెప్పుల‌కు పిన్నీసు పెట్టి వున్న ఫొటోని డిస్‌ప్లే చేసి ఎంత మంది మీ చెప్పుల‌కు పిన్నీసులు పెట్టి వాడార‌ని అడిగాడు ప్ర‌దీప్‌. దీంతో శోభా శెట్టి త‌న గ‌తాన్ని ఈ సంద‌ర్భంగా గుర్తు చేసుకుంటూ `నాకు బాగా గుర్తుంది నా రెండు షూస్ కి పిన్నీసులు పెట్టుకుని స్కూల్‌కి వెళ్లేదాన్ని.. అప్పుడు చెప్పులు కుట్టాలంటే మూడు నుంచి ఐదు రూపాయ‌లు తీసుకునే వారు. ఆ టైమ్ లో ఆ డ‌బ్బు కూడా మా ద‌గ్గ‌ర లేదు. దాదాపు 20 కిలోమీట‌ర్లు న‌డుచుకుంటూనే వెళ్లేదాన్ని ` అంటూ ఈ సంద‌ర్భంగా శోభా శెట్టి ఎమోష‌న‌ల్ అయింది.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.