English | Telugu

Karthika Deepam2 : వాళ్ళిద్దరి పెళ్ళికి సుమిత్ర ఒప్పుకుంటుందా.. జ్యోత్స్న ఎత్తుగడ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -434 లో..... కార్తీక్ ఫ్రెండ్ కాల్ చేసాడని వెళ్తాడు. నిజానికి చేసింది జ్యోత్స్న.. జ్యోత్స్నని కలవడానికి కార్తీక్ వస్తాడు. ఎందుకు నన్ను రమ్మన్నావని కార్తీక్ అడుగుతాడు. ఈ పెళ్లి మా అమ్మనాన్న చేతులు మీదుగా జరగాలని కండిషన్ ఎందుకు పెట్టావ్.. ఇదంతా కావాలనే చేస్తున్నావ్ కదా.. నేను ఆలా జరగనివ్వనని జ్యోత్స్న అంటుంది.

జరుగుతుంది నువ్వు కేవలం నీ గురించి మాత్రమే ఆలోచిస్తావ్ కానీ నేను నా కుటుంబం గురించి ఆలోచిస్తాను ఖచ్చితంగా మా పెళ్లి జరుగుతుందని కార్తీక్ అంటాడు. జరగదని జ్యోత్స్న ఛాలెంజ్ చేస్తుంది. చాలా కాన్ఫిడెంట్ గా ఈ పెళ్లి జరుగుతుందని చెప్పి కార్తీక్ వెళ్ళిపోతాడు. మరొకవైపు భోజనం చేస్తూ మాట్లాడుకుందామని శివన్నారాయణతో దశరథ్ అంటాడు. సుమిత్ర ఎక్కడ అని శివన్నారాయణ అడుగుతాడు. రాదట అని పారిజాతం చెప్తుంది. నువ్వెందుకు చెప్తున్నావని శివన్నారాయణ అంటాడు. అప్పుడే సుమిత్ర వచ్చి.. నేను మీరు తీసుకున్న ఏ నిర్ణయానికి ఎదురు మాట్లాడలేదు కానీ ఈసారి నా వల్ల కావట్లేదు మావయ్య అని సుమిత్ర అంటుంది.

నా కూతురిని చంపాలని అనుకుంది.. అలాంటి తన పెళ్లి నా చేతులు మీదుగా అంటే నేను ఒప్పుకోనని సుమిత్ర అంటుంది. నీకు కూడా ఇష్టం లేదని చెప్పు జ్యోత్స్న అని పారిజాతం అంటుంది. తాత నిర్ణయమే నా నిర్ణయమని చెప్పి జ్యోత్స్న అందరికి షాక్ ఇస్తుంది. తాత మన గురించి అలోచించి ఇదంతా చేస్తున్నాడు మమ్మీ ఒప్పుకోమని జ్యోత్స్న రిక్వెస్ట్ చేస్తుంది. నా మనవరాలు ఏదో ప్లాన్ చేసినట్లు ఉంది.. మనం కూడా ఒప్పుకోవాలని పారిజాతం అనుకొని.. నేను ఆయన నిర్ణయానికి సపోర్ట్ చేస్తానని పారిజాతం అంటుంది. మరొకవైపు కార్తీక్ ఇంటికి వస్తాడు. జరిగిందంతా దీపకి చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.