English | Telugu

జానీ మాస్టర్ కి కోపం తెప్పించిందెవరు?

ఢీ డ్యాన్సింగ్ షో.. అటు అదరగొట్టే డ్యాన్సులతో, ఆది-ప్రదీప్ కామెడీతో, అందమైన జడ్జెస్ నవ్వులతో దూసుకుపోతోంది. ఈ షో ఇప్పుడు ఎంతో సక్సెస్ఫుల్ గా నడుస్తోంది. ఇటీవల ఈ షో లేటెస్ట్ ప్రోమోని నిర్వాహ‌కులు రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో జానీ మాస్టర్ చాలా సీరియస్ గా సీట్ లోంచి లేచి వెళ్లిపోవడం చూపించారు. ఇక ఈ ప్రోమోలో ఒక రష్యన్ భామతో ఆది చేసిన కామెడీ బాగా నవ్వు తెప్పిస్తుంది. 'పుష్ప' మూవీ నుంచి "ఊ అంటావా" సాంగ్ కి రష్యన్ బ్యూటీ చేసిన డాన్స్ అద్దిరిపోయింది.

"వందేమాతరం...మనదే ఈ తరం" అనే సాంగ్ కి కొంతమంది డాన్సర్స్ అదరగొట్టేసారు. ఈ సాంగ్ కి జడ్జెస్ లేచి సెల్యూట్ చేశారు కూడా. అప్పటివరకు అంతా బానే నడిచింది.అంతలోనే జానీ మాస్టర్ సీరియస్ ఇపోయారు. "ఢీ షో చాలా పవర్ ఫుల్, సీరియస్ గానే చెబుతున్నా, పెర్ఫార్మెన్స్ ఏమీ బాలేదు, కొరియోగ్రఫీ కూడా బాగా లేదు. అసలు ఏం బాలేదు" అంటూ జడ్జి సీటులోంచి లేచి వెళ్లిపోయారు జానీ మాస్టర్. దాంతో అక్కడి వాతావరణం ఒక్కసారి వేడెక్కింది. ఇంతకు జానీ మాస్టర్ కోపానికి కారణం ఏమిటి? అనే విషయం తెలుసుకోవాలంటే ఈ వారం ఎపిసోడ్ కోసం కాస్త వెయిట్ చేయాల్సిందే.

Jayam serial : పారు వేసిన ప్లాన్.. గంగని అపార్థం చేసుకున్న రుద్ర!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -140 లో..... పెళ్లి అయి మొదటిసారి ఇంటికి వచ్చిన అల్లుడు కూతురికి లక్ష్మి మర్యాదలు చేస్తుంది. రుద్రకి వరుస అయ్యోవాళ్ళు ఒక ఆటాడుకుంటారు. నల్లపూసల కార్యక్రమం అయ్యాక శోభనానికి ఏర్పాట్లు చేస్తారు. ఇద్దరికి బంతాట ఆడిపిస్తారు. బిందెలో రింగ్ తీయిస్తారు. ఇద్దరు సరదాగా ఉంటారు. రుద్ర వంక గంగ చూస్తుంటే.. ఏంటి చూస్తున్నావ్ వెళ్లి కింద పడుకోమని రుద్ర అంటాడు. ఆ తర్వాత రుద్ర, గంగ సరదాగా బాక్సింగ్ చేస్తుంటారు. అప్పుడే రుద్ర కాలికి సెల్ఫీ స్టిక్ తగులుతుంది. అది రౌడీ చేత పారు పెట్టిస్తుంది.