Read more!

English | Telugu

ఫస్ట్ బోనం ఎత్తినప్పుడు 21 రూ..ఇచ్చారు...నెలరోజులు చాకోలెట్స్ కొనుక్కుని తిన్నా


తెలంగాణలో బోనాల పండగ జాతర ఎంత ధూమ్ ధామ్ గా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి ఈ నేపథ్యంలోనే శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా బోనాల స్పెషల్ ప్రోగ్రాంని ప్లాన్ చేసింది. ఈ కార్యక్రమానికి జోగిని శ్యామల వచ్చారు. ఇంద్రజ, రష్మీ ఇద్దరూ కలిసి ఎన్నో విషయాలను ఆమెను అడిగి తెలుసుకున్నారు. "నా ఏడవ ఏట బోనాల పండగలో ఒక భాగం  అయ్యాను. తెలంగాణాలో నేను ఫస్ట్ బోనం ఎత్తినప్పుడు చీరా సారె పెట్టి 21 రూపాయలు ఇచ్చారు. ఆ డబ్బులతో నెలరోజులు చాకోలెట్స్ కొనుక్కుని తిన్నాను. ఇప్పుడు బోనాల పండగ అనేది ప్రతీ రాష్ట్రంలో ప్రతీ దేశంలో చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. 30 ఏళ్లుగా నేను అమ్మవారి సేవ చేస్తున్నందుకు లష్కర్ కి ఆడపచుగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి  ఆలయంలో ప్రతీ ఏట తోలి బోనం ఎత్తుకునే మొదటి అవకాశం నాకే ఉంది. అందుకే నన్ను తెలంగాణ ఆడపడుచు అంటారు.

నేను ఉన్నంత వరకు అమ్మవారికి తోలి బోనం ఎత్తే అవకాశం ఉంది. నేను నా జీవితంలో ఎన్నో అవమానాలను ఎదుర్కున్న సందర్భాలు  కూడా ఉన్నాయి. నన్నే కాదు మా పేరెంట్స్ కూడా రకరకాలుగా  అనేవారు. ఎందుకు అలా రోడ్ల మీద తిరుగుతావ్ చదువుకోవచ్చు కదా అన్నారు. నన్ను ఎవరైతే అవమానించారో వాళ్ళ ఇళ్లల్లోకి కూడా వెళ్లి బోనాలు ఎత్తుకుంటాను నేను..స్త్రీని పూజించే పండగ, శక్తిని పూజించే పండగ. అమ్మవారికి పూజ చేసి పచ్చి కుండ మీద నిల్చుని భవిష్యవాణి చెప్తుంది జోగిని. తర్వాత ఈమె బోనాల పాటలకు డాన్స్ చేశారు. ఫైనల్ గా ఆమె భవిష్యవాణి చెప్పింది. చేసిన పూజలకు సంతోషంగా ఉన్నానని అందరినీ కాపాడుకుంటాను" అని  చెప్పడంతో ఈ బోనాల స్పెషల్ వేడుక ఎండ్ అయ్యింది.