English | Telugu

ఫస్ట్ బోనం ఎత్తినప్పుడు 21 రూ..ఇచ్చారు...నెలరోజులు చాకోలెట్స్ కొనుక్కుని తిన్నా


తెలంగాణలో బోనాల పండగ జాతర ఎంత ధూమ్ ధామ్ గా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి ఈ నేపథ్యంలోనే శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా బోనాల స్పెషల్ ప్రోగ్రాంని ప్లాన్ చేసింది. ఈ కార్యక్రమానికి జోగిని శ్యామల వచ్చారు. ఇంద్రజ, రష్మీ ఇద్దరూ కలిసి ఎన్నో విషయాలను ఆమెను అడిగి తెలుసుకున్నారు. "నా ఏడవ ఏట బోనాల పండగలో ఒక భాగం అయ్యాను. తెలంగాణాలో నేను ఫస్ట్ బోనం ఎత్తినప్పుడు చీరా సారె పెట్టి 21 రూపాయలు ఇచ్చారు. ఆ డబ్బులతో నెలరోజులు చాకోలెట్స్ కొనుక్కుని తిన్నాను. ఇప్పుడు బోనాల పండగ అనేది ప్రతీ రాష్ట్రంలో ప్రతీ దేశంలో చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. 30 ఏళ్లుగా నేను అమ్మవారి సేవ చేస్తున్నందుకు లష్కర్ కి ఆడపచుగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ప్రతీ ఏట తోలి బోనం ఎత్తుకునే మొదటి అవకాశం నాకే ఉంది. అందుకే నన్ను తెలంగాణ ఆడపడుచు అంటారు.

నేను ఉన్నంత వరకు అమ్మవారికి తోలి బోనం ఎత్తే అవకాశం ఉంది. నేను నా జీవితంలో ఎన్నో అవమానాలను ఎదుర్కున్న సందర్భాలు కూడా ఉన్నాయి. నన్నే కాదు మా పేరెంట్స్ కూడా రకరకాలుగా అనేవారు. ఎందుకు అలా రోడ్ల మీద తిరుగుతావ్ చదువుకోవచ్చు కదా అన్నారు. నన్ను ఎవరైతే అవమానించారో వాళ్ళ ఇళ్లల్లోకి కూడా వెళ్లి బోనాలు ఎత్తుకుంటాను నేను..స్త్రీని పూజించే పండగ, శక్తిని పూజించే పండగ. అమ్మవారికి పూజ చేసి పచ్చి కుండ మీద నిల్చుని భవిష్యవాణి చెప్తుంది జోగిని. తర్వాత ఈమె బోనాల పాటలకు డాన్స్ చేశారు. ఫైనల్ గా ఆమె భవిష్యవాణి చెప్పింది. చేసిన పూజలకు సంతోషంగా ఉన్నానని అందరినీ కాపాడుకుంటాను" అని చెప్పడంతో ఈ బోనాల స్పెషల్ వేడుక ఎండ్ అయ్యింది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.