English | Telugu

Jayam serial : భానుని చంపింది రుద్ర కాదని పోలీసులకి క్లారిటీ.. మరి ఎవరు?

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -59 లో.....సంఘటన రీక్రియేట్ లో నేను ఉంటానని గంగ అంటుంటే రుద్ర వద్దని అంటాడు. నేను అమ్మాయిని నాకు బలం లేదని అనుకుంటున్నారా.. నాకు చాలా బలం ఉంది .. ఇప్పుడు నన్ను వద్దన్నారంటే ఇక్కడ నుండి దుకేస్తానని రుద్రని బ్లాక్ మెయిల్ చేస్తుంది గంగ కానీ తనపై రుద్ర కోప్పడతాడు.

ఆ తర్వాత వీరు నువ్వు చెయ్ అని రుద్ర అంటాడు. వీరు బయపడుతుంటే నేనున్నాను.. నీకెందుకు టెన్షన్ అని రుద్ర అంటాడు. భాను ప్లేస్ లో వీరు ఉంటాడు. వీరుని రుద్ర గట్టిగా నెడితే గోడ చివరి వరకు వెళ్లి అక్కడ గోడ దగ్గర ఆగిపోతాడు. రుద్ర గారు అంత గట్టిగా నెట్టినా కూడ వీరు కిందపడలేదు.. గోడ అడ్డు ఉంది.. అయితే భాను గారు కూడ పడే ఛాన్స్ లేదు.. ఎవరో కావాలనే పడేసారని ఇన్‌స్పెక్టర్ అంటాడు. ఈ కేసులో రుద్ర గారి తప్పేం లేదని అనుకుంటారు.

ఆ తర్వాత గంగ, రుద్ర, పెద్దసారు ఇంటికి వస్తారు. రుద్రని పెద్దసారు హగ్ చేసుకుంటాడు. మనసులో ఉన్న భారం మొత్తం దిగిపోయింది. నువ్వు ప్రాణంగా చూసుకున్నావ్ వాడిని.. అలాంటిది నువ్వు వాడి ప్రాణం తీసావ్ అంటుంటే చాలా బాధపడ్డానని పెద్దసారు అంటాడు. ఈ విషయం వెంటనే మీ పెద్దమ్మ తో చెప్దామని పెద్దసారు అంటాడు. నేను నెట్టలేదని తెలిసింది కానీ ఎవరు నెట్టారో తెలియదు కదా అని రుద్ర అంటాడు. నీకు వ్యతిరేకంగా ఉన్నవాళ్లు నీకు ఇష్టమైన భానుని దూరం చేస్తే మానసికంగా కుంగిపోతావని ఇలా చేసి ఉంటారని పెద్దసారు అనగానే అవును నిజమే అనిపిస్తుందని రుద్ర అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.