English | Telugu

Jayam serial : అర్థనారీశ్వరిలా గంగ.. కాపాడిన రుద్ర.!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -31 లో.... గంగ కోసం రుద్ర వెతుకుతుంటాడు. మరొకవైపు రౌడీలు కూడా గంగ కోసం వెతుకుతారు. రౌడీల నుండి గంగ తప్పించుకొని గుడిలోకి వెళ్తుంది. అక్కడ స్పృహతప్పి పడిపోతే అక్కడున్న వాళ్ళు తనకి హెల్ప్ చేస్తారు. గంగ అక్కడున్న పంతులికి జరిగిందంతా చెప్తుంది. నువ్వు ఇప్పుడే వెళ్ళకని పంతులు చెప్తాడు. మరొకవైపు రుద్రని చంపడానికి వీరు రౌడీని మాట్లాడతాడు.

రుద్ర ఒక దగ్గర కార్ ఆపి పక్కకి వెళ్తాడు. మళ్ళీ కార్ దగ్గరికి వచ్చి ఎక్కబోతుంటే వెనకాల నుండి రౌడీ వచ్చి ఆక్సిడెంట్ చేస్తాడు. రుద్ర దూరంగా పడతాడు. ఆ రౌడీ వీరుకి ఫోన్ చేసి పనిపూర్తి అయిందని చెప్తాడు. మరొకవైపు రౌడీలు గుడికి వెళ్లి ఒక అమ్మాయి ఇటువైపు ఏమైనా వచ్చిందా అని అడుగుతారు. లేదని పంతులు చెప్తాడు. రౌడీలు అక్కడక్కడే తిరుగుతుంటారు. గంగ ఇంకా కొంతమంది కలిసి అర్థనారీశ్వరిలాగా రెడీ అయి డాన్స్ చేస్తుంటారు. ఎక్కడ ఆ రౌడీలు గుర్తుపడతారోనని గంగతో పాటు పంతులు టెన్షన్ పడతాడు. రౌడీలు అక్కడ నుండి వెళ్ళిపోతారు. మరొకవైపు రుద్ర దగ్గరికి ఒక స్వామి వచ్చి.. తనకి నీళ్లు ఇచ్చి కట్టుకడతాడు. రుద్ర స్పృహలోకి వస్తాడు. నువ్వు ఎవరి గురించి అయితే వెళ్తున్నావో తనే నీ జీవితగమనం అవుతుందని స్వామి చెప్తాడు. గంగ కోసం రుద్ర బయల్దేరతాడు.

మరొకవైపు కృతజ్ఞతలు పంతులు గారు.. నన్ను ఆ రౌడీల నుండి కాపాడారని గంగ అక్కడున్న వాళ్ళతో మాట్లాడుతుంటే.. మళ్ళీ రౌడీలు వస్తారు‌. గంగ ని పెళ్లి చేసుకోవాలని అనుకున్న మను వస్తాడు. ఏం యాక్టింగ్ చేశారు. అక్కడున్న వాళ్లందరికి కత్తిపెట్టి బెదిరిస్తాడు. ఇప్పుడు ఇక్కడే నిన్ను పెళ్లి చేసుకుంటా వెళ్లి రెడీ చేసి తీసుకొని రండి అనీ అక్కడున్న వాళ్ళతో చెప్తాడు. గంగని తీసుకొని లోపలికి వెళ్తారు. తరువాయి భాగంలో మను గంగ మెడలో తాళి కట్టబోతుంటే రుద్ర ఏంట్రీ ఇచ్చి మనుని కొడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.