English | Telugu

Jayam serial : గంగకి థాంక్స్ చెప్పిన రుద్ర.. గదిలోకి వెళ్ళిన ఆమె దొరికిపోతుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం' (Jayam). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -18 లో... పైడిరాజు దగ్గరికి వీరు వాళ్ళ మనిషి ఒకడు వస్తాడు. నేను కోటి రూపాయలు ఎదురుకట్నం ఇస్తాను.. నీ కూతురిని నాకు ఇచ్చి పెళ్లి చెయ్.. ఆ తర్వాత ముంబై తీసుకొని వెళ్తానని చెప్పగానే దానికి పైడిరాజు సరే అంటాడు. పైడిరాజు ఒప్పుకున్న విషయాన్ని అతను వీరుకి ఫోన్ చేసి చెప్తాడు. గంగని నువ్వు పెళ్లి చేసుకొని నాకు ఇచ్చేయ్ అని వీరు అంటాడు. దానికి అతను సరే అంటాడు.

గంగ కిచెన్ లో ఉండగా మక్కం ఇంటికి వస్తాడు. గంగ అక్కడ ఉండడం చూసి నువ్వు ఇక్కడ ఉన్నావ్ ఏంటని అడుగుతాడు. నన్ను పెద్దసారు పనిలో పెట్టాడు. నువ్వు నా గురించి సర్ తో చెప్తే నీ సంగతి చెప్తానని మక్కంని బ్లాక్ మెయిల్ చేస్తుంది గంగ‌. అప్పుడే రుద్ర వస్తాడు‌. తనకి కనిపించకుండా గంగ మొహంపై చున్నీ కప్పుకుంటుంది. ఇద్దరికీ కాఫీ తీసుకొని రమ్మని గంగకి చెప్తాడు రుద్ర. మా పెద్దమ్మ నీ వల్ల హ్యాపీగా ఉంటుందని విన్నాను.. ఎప్పుడు అలాగే ఉండేలా చూడు అని గంగతో రుద్ర అంటాడు. రుద్ర సూపర్ మార్కెట్ కి వెళ్తాడు. అతని కంటే ముందే వెళ్ళాలని మక్కం స్కూటీపై గంగ వెళ్తుంది. ఇక గంగ స్పీడ్ గా వెళ్తూ మక్కంని వాటర్ లో పడేస్తుంది. ఆ తర్వాత రుద్ర కంటే ముందే గంగ సూపర్ మార్కెట్ కి వెళ్తుంది.

అక్కడ ఒకమ్మాయి ప్రేమించిన అబ్బాయి మోసం చేసాడని సూసైడ్ చేసుకోబోతుంటే రుద్ర ఆపి ఒక్కరోజు టైమ్ ఇవ్వు.. నీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తానని చెప్తాడు. ఆ తర్వాత సూపర్ మార్కెట్ లో మీటింగ్ జరుగుతుంది. అక్కడికి గంగని కూడా పిలుస్తారు. అసలు గంగని ఇక్కడికి ఎందుకు పిలిచావని పెద్దసారు అడుగుతాడు.

తరువాయి భాగంలో గంగ చెవికమ్మ రుద్ర రూమ్ లో పడిపోతుంది. ఇక రుద్ర స్నానం చేస్తున్న సమయంలో గంగ తన చెవికమ్మ కోసం అతని గదిలోకి వెళ్ళి వెతుకుతుంది. ఇక రుద్రపై ఉన్న కోపాన్ని పిల్లోని పట్టుకొని.. ఇది మీరే అంటూ పిల్లోని కొడుతుంది గంగ. ఇక అప్పుడే వెనకాల నుండి ఎవరో వచ్చి తన భుజంపై చేయి వేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.