English | Telugu

Jayam serial : శకుంతులకి దగ్గరైన గంగ.. తనని రుద్ర చూస్తాడా!

జీ తెలుగు లో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -17 లో.....శకుంతల బిర్యాని చేసి ఇంట్లో అందరికి పెడుతుంది. ఆ తర్వాత రుద్ర నిద్రలో ఒక్కసారి ఉల్లిక్కి పడి లేచి పెద్దమ్మ గోరు ముద్దలు అయినా తినే భాగ్యం లేదు.. కనీసం తన వంట అయిన తిందామని అందరు పడుకున్నాక రుద్ర కిందకి వచ్చి.. మిగిలిపోయిన బిర్యానిని తింటుంటాడు. గతంలో వాళ్ళ పెద్దమ్మ శకుంతల తనతో ఎంత ప్రేమగా ఉందో గుర్తు చేసుకొని బాధపడుతాడు.

ఆ తర్వాత కిచెన్ లో ఏదో సౌండ్ వస్తుందని గంగ కిందకి వస్తుంది. రుద్ర బిర్యాని తినడం చూసి ఈయనకి ఏంటి దెయ్యం పట్టిందా ఏంటని అనుకుంటుంది. మరుసటి రోజు గంగ ఉదయం లేచి పూజ చేస్తుంది. శకుంతలకి హారతి ఇవ్వడానికి గంగ వెళ్తుంటే పెద్దసారు ఆపుతాడు. తను అన్నివేళల ఒకేలా ఉండదు గంగ అని అంటుంటే అప్పుడే శకుంతల వచ్చి గంగ ఎవరు తన పేరు భాను కదా అంటుంది. అవును తన పేరు గంగ భవాని కానీ అందరు భాను అంటారని పెద్దసారు అనగానే అందరు తనని బాను అనాలని శకుంతల అంటుంది. పూజ చేసి మంచి పని చేసావని గంగతో శకుంతల అంటుంది. ఇంట్లో అందరిని లేపి మరి గంగ హారతి ఇస్తుంది.

మరొకవైపు గంగ తండ్రి పైడిరాజు దగ్గరికి వీరు మనిషి వచ్చి డబ్బు ఎరగా చూపిస్తాడు. బట్టలు బండి కొనిస్తాడు. నాకూ నీ కూతురు కావాలి.. ఎదురు కట్నం కోటి రూపాయలు ఇస్తానంటాడు. దానికి పైడిరాజు సంతోషంగా ఒప్పుకుంటాడు. తరువాయి భాగంలో మక్కం సూపర్ మార్కెట్ మేనేజర్ రుద్ర దగ్గరికి వస్తాడు. అక్కడ గంగను చూస్తాడు. నేను ఇక్కడ ఉన్నట్టు సర్ కి చెప్పకండి అని గంగ రిక్వెస్ట్ చేస్తుంది. గంగ చున్నీ మొహంపై కప్పుకోని వచ్చి రుద్ర ఇంకా మక్కంకి కాఫీ ఇస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.