English | Telugu

మేము ఎలాంటి తప్పు చేయలేదు.. పెళ్లి చేసుకోబోతున్నాం!

ఢీ డాన్సర్ జాను మీద కొన్ని వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. జాను తన మీద వస్తున్న రూమర్స్ కి అలాగే పెళ్లి చేసుకోబోతోందన్న విషయం మీద ఏడుస్తూ కూడా వీడియోస్ చేసింది. ఐతే ఇప్పుడు జాను పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్ దేవగన్ రీసెంట్ గా ఒక వీడియోని రిలీజ్ చేసాడు.

"నేను జానుతో ఉన్న ఫోటోని బాగా ట్రోల్ చేస్తున్నారు. ఐతే అది నిజమే. నేను జాను ఇష్టపడ్డాం. మేము త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం. మా ఇంట్లో వాళ్ళ ఇంట్లో కూడా ఒప్పుకున్నారు. అందరి అంగీకారం మేరకే పెళ్లి చేసుకోబోతున్నాం. మేము ఎలాంటి తప్పు చేయలేదు. మేము కలిసి బతకాలని అనుకుంటున్నాం. అలాంటి మా మీద రకరకాల కామెంట్స్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు మీడియాలో. మాకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్లందరికీ థ్యాంక్యూ సో మచ్" అని చెప్పాడు.

ఆ తర్వాత జాను వచ్చి "నేను ఏదైతే వీడియో చేసానో దానికి చాల మంది బాధపడ్డారు. కానీ మాకు ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్లందరికీ థ్యాంక్యూ సో మచ్. కొద్దీ రోజులుగా అన్ని గమనిస్తున్నాను. చివరికి తట్టుకోలేక డిప్రెషన్ లోకి వెళ్ళిపోయా..మా ఫామిలీ ఎక్కడ బాధపడుతుందో అని భయమేసింది అంతేకాని ఎవరికో భయపడి కాదు. నేను అలా భయపడే దాన్నీ ఐతే ఈ స్టేజికి వచ్చేదాన్ని కాదు. నేను నా బాబు హ్యాపీగా ఉన్నాం. నా మీద ఎన్నో ట్రోల్స్ వస్తున్నాయి. ఎవరు ఎన్ని అనుకున్నా నేను నా లైఫ్ లో ఎప్పుడూ స్ట్రాంగ్ గానే ఉన్నాను, ఉంటాను" అని చెప్పింది.

ఇక జాను ఏడుస్తూ చేసిన వీడియోస్ చాలా వైరల్ ఐపోయాయి. ఆమె ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య దాదాపు 1 .5 మిలియన్స్ కి చేరిపోయారు. ఇక నెటిజన్స్ ఐతే ఆ జంటకి విషెస్ చెప్తూ మెసేజెస్ చేస్తున్నారు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.