English | Telugu

శైలేంద్ర చెంప చెళ్ళుమనిపించిన జగతి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -794 లో..‌రిషి, విశ్వనాథ్ ఇద్దరు చెస్ ఆడుతుంటారు. విశ్వనాథ్ ని గెలిపించడానికి రిషి ఓడిపోతాడు. రిషి అక్కడ నుండి వెళ్ళిపోయాక.. రిషి మనసులో ఏదో బాధ ఉంది.. ఇన్ని రోజులు అయినా బాధ తగ్గట్లేదు అంటే రిషి మనసుకి పెద్ద గాయమే అయింది. ఇన్ని రోజులైనా మనకు చెప్పట్లేదని ఏంజెల్ తో విశ్వనాథ్ అంటాడు. నువ్వు నిజమైన ఫ్రెండ్ అయితే రిషి బాధని తగ్గించే ప్రయత్నం చెయమని ఏంజెల్ తో విశ్వనాథ్ అంటాడు.

మరొక వైపు ఎలాగైనా రిషి తొందరలోనే వస్తాడనిపిస్తుంది మావయ్య.. రిషి గురించి తప్పకుండా వసుధారకి తెలుస్తుంది. వాళ్ళ బంధం అలాంటిదని మహేంద్రతో ధరణి అంటుంది. అది వింటాడు శైలేంద్ర. ధరణిని శైలేంద్ర పక్కకు పిలిచి మాట్లాడతాడు. ఏంటి రిషి వస్తాడని అంటున్నావ్. నీకు తెలుసా? నీకేమైనా ఫోన్ చేసాడా అని ధరణిని శైలేంద్ర అడుగుతాడు. రిషి తప్పకుండా వస్తాడని ధరణి అనగానే.. అసలు రిషి బ్రతికి ఉన్నాడంటావా అని శైలేంద్ర అనగానే.. జగతి వచ్చి శైలేంద్ర చెంప చెల్లుమనిపిస్తుంది. అందరూ ఒక్కసారిగా వాళ్ళ దగ్గరికి వస్తారు. ఏమైందని అడుగుతారు. ఏమైంది జగతి అని ఫణింద్ర అడుగుతాడు.

జగతి సైలెంట్ గా ఉండడంతో.. ధరణి నువ్వైనా చెప్పమని ఫణింద్ర అడుగుతాడు. అయన ఒక మాట నోరు జారారు.. అసలు రిషి బ్రతికే ఉన్నాడా అని శైలేంద్ర అన్నాడని ధరణి చెప్తుంది. ఫణింద్ర కోపంతో ఎంత మాట అన్నావ్ రా అని శైలేంద్రని ఫణీంద్ర కొడుతుండగామహేంద్ర ఆపుతాడు. రిషి నీకు తమ్ముడు అలా అనొచ్చా? రిషికి కన్న తల్లి జగతి.. తనతో ఆ మాట అంటే ఎంత కోపం వస్తుంది. ఇంకెప్పుడు అలా అనకని ఫణింద్ర చెప్పి వెళ్ళిపోతాడు. ఏంటి రిషిని ఒక్క మాట అంటేనే తట్టుకోలేని జగతి రిషిపై అంత పెద్ద నింద ఎందుకు వేసింది. దీని వెనకాల కారణం ఏంటని మహేంద్ర అనుకుంటాడు.

మరొక వైపు రిషి, వసుధార ఇద్దరు వాళ్ళ ప్రేమని గుర్తు చేసుకుంటారు. మర్చిపోవాలి అనుకుంటునే రిషి గుర్తుచేసుకుంటాడు. మరొక వైపు ఇప్పటికైనా ఆ జగతి గురించి అర్థం అయిందా? తను ఆడపులి అని దేవయాని అంటుంది. ఎన్ని రోజులు ఇలా ఉండాలి... ఎప్పటికైనా అ నిజం తెలిసేదే కదా మమ్మీ అని శైలేంద్ర అంటాడు. ఏ నిజమని దేవయాని అడుగుతుంది. రిషి బ్రతికిలేడన్నా విషయం అని శైలేంద్ర అనగానే.. దేవయాని షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.