English | Telugu

మలేషియాలో ఫస్ట్ వ్లాగ్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ

బిగ్ బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా మలేషియాలో వెకేషన్ ఎంజాయ్ చేసింది. తాజాగా మలేషియా ట్విన్ టవర్స్ ముందు దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మలేషియా వెళ్లి అక్కడి తీసిన ఫస్ట్ వీడియోని అంటూ యూట్యూబ్ లో అప్ డేట్ చేసింది. ట్విన్ టవర్స్ ని చూడడానికే మలేషియా వెళ్లినట్లు చెప్పింది..కార్ లో వెళ్తూ మొత్తాన్ని వీడియో తీసింది.

ఇక ఇనాయ ఫ్రెండ్ ట్విన్ టవర్స్ ప్లేస్ ని చూసి హైదరాబాద్ కూడా ఇలాగే డెవలప్ కావాలి అని మిగతా దేశాల వాళ్ళు కూడా వచ్చి అలాగే ఫొటోస్ దిగాలి అంటూ కోరుకునేసరికి హైదరాబాద్ గవర్నమెంట్ వినిపిస్తోందా అంటూ ఇనాయ కామెడీ చేసింది. ఇక అలా వెళుతూ మలేషియాలోని టాలెస్ట్ బిల్డింగ్ ని చూపించింది అందులో 116 ఫ్లోర్స్ ఉంటాయని చెప్పింది. స్ట్రీట్ ఫుడ్ కార్నర్ కి వెళ్లారు వెరైటీ ఫుడ్ తినడానికి...అక్కడ ఇనాయ తనకు ఎంతో ఇష్టమైన పనస తొనలు తీసుకుంది. తర్వాత తమతో వచ్చిన బర్త్ డే బాయ్ కి షూస్ కొనడానికి అన్ని షాప్స్ కి వెళ్లారు. చివరికి ఒక మాల్ లో ఆ పిల్లాడికి కావాల్సినవి తీసుకున్నారు.

అలా చివరికి ఇండియన్ ఫుడ్ తినడానికి వెళ్లి అక్కడ ఫుడ్ తినేసి మళ్ళీ చీకట్లో ఒకసారి ట్విన్ టవర్స్ ని చూపించి క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోయింది ఇనాయ సుల్తానా. తెలుగులో ‘బుజ్జి ఇలా రా, నటరత్నాలు… యద్భావం తద్భవతి వంటి సినిమాలలో హీరోయిన్ గా నటించింది. కానీ ఆమెకు ఒక్క హిట్ కూడా పడలేదు. సోషల్ మీడియాలో బాగానే ఫాలోవర్స్ ను సంపాదించుకున్న ఇనాయ బిగ్ బాస్ హౌస్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చి రచ్చ చేసిన విషయం తెలిసిందే.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.