English | Telugu

కాజల్ అగర్వాల్ కు అసలు పెళ్ళెందుకైపోయిందో...


రీసెంట్ గా హారర్ థ్రిల్లర్ మూవీ "పిండం" లో నటించిన నటుడు శ్రీరామ్ రీసెంట్ గా ఒక షోలో పార్టిసిపేట్ చేసాడు. కాజల్ అగర్వాల్ కు అసలు పెళ్ళెందుకైపోయిందో అంటూ ఫీలయ్యాడు. ఐతే ఈ షోలో కొన్ని పిక్స్ ఇచ్చి మ్యాచింగ్ చేయమని హోస్ట్ అష్షు రెడ్డి చెప్పేసరికి అందులో కాజల్ పిక్ కనిపించింది. అప్పుడు అసలు విషయం చెప్పాడు "దడ" మూవీలో కాజల్, శ్రీరామ్, అక్కినేని నాగ చైతన్య కలిసి చేశారు. ఐతే ఈ మూవీలో కాజల్ తో డేటింగ్ సీన్స్ లాంటివి ఉంటే బాగుండేది అంటూ చెప్పాడు. కాజల్ తో అండర్ వాటర్ రొమాన్స్ చేయాలనీ ఉంది అంటూ ఆ రెండు పిక్స్ కి మ్యాచింగ్ చేసాడు. ఎందుకు ఇలా మ్యాచింగ్ చేసాడో దానికి ఉన్న రీజన్ ఏంటో కూడా చెప్పాడు. కాజల్ కి స్విమ్మింగ్ వచ్చు కానీ తనకు రాదనీ చెప్పాడు. అమ్మాయిలకు తెలుసు అని చెప్పే అబ్బాయిల కంటే తెలీదు అని చెప్పే అబ్బాయిలంటేనే ఎక్కువ ఇష్టం.

చెప్పాలంటే కాజల్ చాలా బాగుంటుంది. చాలా ఇంటెలిజెంట్ కూడా..ఐనా నాకు పెళ్లయిపోయింది ఆవిడకు పెళ్లయిపోయింది ఇంకేముంది అంటూ కామెడీ చేసాడు శ్రీరామ్. అలాగే తాను నటించిన 'రెక్కీ' వెబ్ సిరీస్ తనకు ఎంతో నచ్చిందని చెప్పాడు. ప్రస్తుతం ఓటీటీ కోసం 'నెట్ వర్క్, హరికథ' అనే ప్రాజెక్ట్స్ చేస్తున్నట్లు చెప్పాడు. తమిళ్ లో 'బ్లాక్ మెయిల్' అనే మూవీ అలాగే 'సంభవం' అనే చిత్రంలో కూడా నటిస్తున్నానని చెప్పాడు. అలాగే తమిళ్ లో "కాఫీ విత్ కాదల్" అనే మూవీలో జీవ, జైతో కలిసి నటించాడు. రెక్కీ 2 త్వరలో రాబోతోంది. అందులో ఫామిలీ డ్రామా కూడా ఉండబోతోంది అని చెప్పాడు. యూత్ కి సోషల్ మీడియా గురించి ఒక మెసేజ్ ఇచ్చాడు. వెస్ట్రన్ పీపుల్ అంతా మనల్ని మన తెలివితేటల్ని తక్కువ చేసి సోషల్ మీడియాకి అలవాటు చేయాలనుకుంటున్నారు. సోషల్ మీడియా ఫ్రెండ్స్ అంతా ఫ్రెండ్స్ కాదు..డైరెక్ట్ ఇంటరాక్షన్ తో ఫ్రెండ్స్ ని పెంచుకోండి. మీకోసం ఎవరు నిలబడతారో వాళ్లనే ఎంచుకోండి. మీరు పోస్ట్ చేసే రీల్స్ కి లైక్స్ వేసిన వాళ్లంతా ఫ్రెండ్స్ కారు అని చెప్పాడు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.