English | Telugu

ఎండీ పదవికి శైలేంద్ర అనర్హుడు.. తాగి పడిపోయిన మహేంద్ర!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -889 లో.....ఎండీగా బాధ్యతలు తీసుకోమని మహేంద్రకు ఫణింద్ర చెప్తాడు. నావల్ల కాదు నేను తీసుకోలేనని మహేంద్ర చెప్పి మీటింగ్ మధ్యలో నుండి వెళ్లిపోతాడు. ఇప్పుడు ఖచ్చితంగా కాలేజీకి ఎండీ అవసరం కదా? ఎవరిని ఎండీ గా కూర్చోపెట్టాలో ఇప్పుడు డిస్కషన్ చేయాలని ఫణింద్ర అంటాడు.

ఆ తర్వాత ఎవరో ఎందుకు డాడ్? మీరు ఉన్నారు కదా అని శైలేంద్ర అంటాడు. లేదు, ఎండీగా బాధ్యతలు తీసుకోవాలంటే చాలా అవగాహన ఉండాలి. నాకంత ఆసక్తి లేదు. అందుకే ఎండీగా ఎవరున్నా నేను సపోర్ట్ ఇస్తూనే ఉంటానని ఫణీంద్ర అంటాడు. ఎవరో ఎందుకు శైలేంద్ర ఉన్నాడు కదా అని దేవయాని అనగానే... వసుధార తెలివిగా అలోచించి.. బోర్డు మెంబెర్స్ కి శైలేంద్రకి ఇది వరకు చేసిన అనుభవం లేదు. పైగా మొన్న చెక్కు విషయం లో చూడకుండా సంతకం చేసి కాలేజీ ని రిస్క్ లో పెట్టాడని వసుధార అనగానే..

అవును శైలేంద్ర ఉండడం ఇష్టం లేదని బోర్డు మెంబెర్స్ అంటారు. ఫణింద్ర కూడా ఎండీ అయ్యే కెపాబిలిటి లేదని శైలేంద్రని అంటాడు. ఆ తర్వాత ఫణింద్ర వసుధార, SI లు మాట్లాడుకుంటారు. రిషిపై నింద వెయ్యడానికి గల కారణాలు SI తో వసుధార చెప్తుంది. కానీ దానికి కారణం అయిన వాళ్ళ గురించి చెప్పదు. మరొక వైపు ఫణింద్ర, వసుధార ఇంటికి వెళ్తారు. రిషి పొద్దున్న నుండి భోజనం చెయ్యలేదని వసుధారకి ధరణి చెప్తుంది. ఇదంతా మా అయన వల్లే అని నాపై కోపంగా ఉందా వసుధారా అని ధరణి అడుగుతుంది. కానీ ఇంత కుట్రలు చేస్తున్న వాళ్ళకి శిక్ష పడాలని ధరణి చెప్పగా.. తొందరలోనే శిక్ష పడుతుందని వసుధార అంటుంది.

ఆ తర్వాత జగతి అత్తయ్య గురించి ఆలోచిస్తూ రిషి భోజనం చెయ్యలేదని ధరణి అనగానే.. నేను వెళ్లి తీసుకోనీ వస్తానని వసుధార వెళ్తుంది. వెళ్లేసరికి జగతిని గుర్తుచేసుకుంటు రిషి బాధపడతాడు. ఆ తర్వాత వసుధార నచ్చజెప్పి రిషిని భోజనం చెయ్యడానికి ఒప్పిస్తుంది. డాడ్ కూడా భోజనం చెయ్యలేదని రిషి అంటాడు. సర్ ఇంటికి రాలేదా? మీటింగ్ మధ్యలోనే వచ్చేసారని వసుధార చెప్పగానే.. డాడ్ ఇంకా ఇంటికి రాలేదు. నాకు టెన్షన్ గా ఉందంటూ మహేంద్ర గురించి వెతుకుతాడు రిషి. మహేంద్రకి ఫోన్ చేస్తే ఎవరో ఒకతను లిఫ్ట్ చేసి.. ఈ ఫోన్ అతను ఇక్కడ తాగి పడిపోయి ఉన్నాడని చెప్పగానే.. రిషి వసుధార ఇద్దరు బయల్దేరతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.