English | Telugu

Guppedantha Manasu : ఆ రౌడీల నుండి వాళ్ళిద్దరిని కాపాడిందెవరు?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -954 లో...అనుపమ, మహేంద్ర ఇద్దరు కలిసి వసుధార దగ్గరకు వచ్చి.. నిన్ను శైలేంద్ర బ్లాక్ మెయిల్ చేసాడని ముందే ఎందుకు చెప్పలేదు అని మహేంద్ర అడుగుతాడు. మీకు చెప్తే వాడు రిషి సర్ ని ఏమైనా చేస్తాడేమోనని భయం వేసి చెప్పలేదని వసుధార చెప్తుంది.

అ తర్వాత అనుపమ మేడమ్ సమయస్పూర్తితో నన్ను ఫాలో అయి వీడియో తీసింది. అది ఇప్పుడు మనకి చాలా హెల్ప్ అవుతుంది. దీంతో అ శైలేంద్ర బయపడి రిషిని తీసుకోని వస్తాడని వసుధార చెప్తుంది. ఈ విషయం ముకుల్ కి చెప్పాలని అనుపమ ముకుల్ కి ఫోన్ చేసి.. శైలేంద్రే వసుధారని బ్లాక్ మెయిల్ చేసిన విషయం చెప్తుంది. ముకుల్ అది విని షాక్ అవుతాడు. ఇప్పటి వరకు శైలేంద్ర తప్పించుకున్నాడు ఇక మీద తప్పించుకోలేడని ముకుల్ అంటాడు. ఎందుకైన మంచిది మీరు అందరు జాగ్రత్తగా ఉండండి అని ముకుల్ చెప్తాడు. ఇప్పుడు శైలేంద్ర ఫోన్ ట్రాప్ లో ఉంది. ఎవరికి ఫోన్ చేసిన మొత్తం బయటపడుతుందని ముకుల్ అనుకుంటాడు. మరొక వైపు శైలేంద్ర వేరే వాళ్ళ ఫోన్ తీసుకొని రిషిని కిడ్నాప్ చేసిన రౌడీలకి ఫోన్ చేస్తాడు. అ రౌడీ రిషి తప్పించుకున్నాడని చెప్పగానే శైలేంద్ర వాళ్లపై కోప్పడతాడు. మరొకవైపు వసుధార బ్రాస్ లైట్ చూస్తు బాధపడుతుంది. శైలేంద్ర దగ్గరకి ధరణి వచ్చి.. చెంపపై ఆ వాతలేంటని అడుగుతుంది. గొడ గీసుకుపోయిందని శైలేంద్ర అంటాడు. గోడ గీసుకుపోయినట్టు లేదు. ఎవరో కొట్టినట్టుంది అయిన మిమ్మల్ని ఎవరు కొడతారని ధరణి అంటుంది.

ఆ తర్వాత దేవయానికి రిషి తప్పించుకున్నాడని శైలేంద్ర చెప్పగానే.. ఇప్పుడు ఏం చేద్దాం? ఈ సమస్య నుండి ఎలా బయటపడటమని దేవయాని టెన్షన్ పడుతుంటుంది. వసుధారని చంపేయ్యలని శైలేంద్ర చెప్తాడు. ఆ తర్వాత ఎవరో రౌడీతో శైలేంద్ర మాట్లాడుతాడు. మరొకవైపు అనుపమ, ముకుల్ , వసుధార ముగ్గురు.. రిషిని తీసుకొని శైలేంద్ర వస్తాడో లేక మరి ఇంకేదైనా ప్లాన్ చేస్తున్నాడోనని మాట్లాడుకుంటారు. అ తర్వాత వసుధార, అనుపమ ఇద్దరు కార్ లో వెళ్తుంటే కొందరు రౌడీలు మేకులతో ఉన్న కర్రని రోడ్డుకి అడ్డంగా పెట్టడంతో వాళ్ళు వెళ్తున్న కార్ టైర్ పంచర్ అవుతుంది. దాంతో వాళ్ళు కార్ లో నుండి బయటకు వచ్చి.. ఏమైందని చూస్తారు. వాళ్ళ దగ్గరకి రౌడీలు వస్తారు. తరువాయి భాగంలో వసుధార, అనుపమలపై రౌడీలు ఎటాక్ చేస్తుంటే.. ఎవరో ఒకతను వచ్చి వాళ్ళని కాపాడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.