English | Telugu

Guppedantha Manasu : ఆ లెటర్ చదివి షాకైన దేవయాని.. అతను ఇంతపని చేశాడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -1103 లో.... మను తండ్రి మహేంద్రనే అని దేవయానికి చెప్తాడు శైలేంద్ర. వసుధార వెళ్లిపోతు లెటర్ లో అదే విషయం రాస్తుంది. ఆ లెటర్ దేవయానికి శైలేంద్ర ఇస్తాడు. అది చదివి దేవయాని షాక్ అవుతూ.. అసలు మహేంద్ర ఇలా చేశాడంటే నేను నమ్మ లేకపోతున్నానని దేవయాని అనగానే.. లెటర్ లో వసుధర అంత క్లియర్ గా రాస్తే నువు నమ్మట్లేదు అంటావని శైలేంద్ర అంటాడు. ఏది ఏమైనా ఈ లెటర్ ని అస్త్రం గా ఉపయోగించాలని దేవయాని అంటుంది.

అందుకే కదా మమ్మీ నేనొక పని చేశానంటూ దేవయానికి చెప్తాడు. వసుధార రాసిన లెటర్ పక్కన పెట్టి.. తానే స్వయంగా ఒక లెటర్ వసుధార రాసినట్టు రాస్తాడు. అందులో మనుగారు మీ తండ్రి చనిపోయారు అందుకే అనుపమ గారు చెప్పలేదని రాస్తాడు. ఆ తర్వాత పనిలో పని ఎండీ గురించి కూడా రాస్తాను అనుకుంటూ నా తర్వాత ఎండీ బాధ్యతలు శైలేంద్రకి ఇవ్వండి అని రాసి మళ్ళీ డౌట్ వస్తుందేమోనని రాసి కొట్టేస్తాడు. ఆ లెటర్ మను టేబుల్ పై పెట్టి శైలేంద్ర వెళ్ళిపోతాడు. అప్పుడే మను వచ్చి ఆ లెటర్ చదివి షాక్ అవుతాడు. ఈ లెటర్ నిజంగానే వసుధర గారే రాశారా అని అనుకుంటాడు. అదంతా శైలంద్ర పక్కన నుండి చూస్తాడు. ఈ విషయం అంతా దేవయానికి ఇలా లెటర్ రాసానంటూ చెప్పగానే నాకు తెలియకుండా ఎందుకిలా చేసావ్ అంటూ తిడుతుంది. కచ్చితంగా ఆ మనుకి డౌట్ వస్తుంది. నువ్వే రాసావ్ అనుకుంటాడని.. ఈ లెటర్ ని మాత్రం ఎవరికి కనపడనివ్వొద్దని దేవయాని అంటుంది.

అప్పుడే ధరణి వచ్చి.. ఏ లెటర్ అంటూ అడుగుతుంది. దాంతో శైలేంద్ర, దేవాయని ఇద్దరు టెన్షన్ పడతారు. ఎదో ఒకటి కవర్ చేస్తారు. మరొకవైపు వసుధార స్పృహ లోకి ఇంకా రాదు. తన పక్కనే రంగ కూర్చొని తననే చూస్తుంటాడు. అప్పుడే సరోజ మరియు రంగా ఫ్రెండ్ వస్తారు. ఏంటి అలా దగ్గర ఉండి చూసుకుంటున్నావని సరోజ అడుగుతుంది. మేడం మంచి వారిలా ఉన్నారని రంగా చెప్తాడు. ఆ తర్వాత వసుధారకి డ్రెస్ రంగాకి ఇచ్చి వెళ్తుంది సరోజ. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.