English | Telugu

వాళ్ళిద్దరూ కామెడీ పీస్ లు.. మహేంద్ర కామెంట్స్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు' (Guppedantha Manasu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -1089 లో.... వసుధార స్పృహ నుండి బయటకు వచ్చి.. అసలు ఏం జరిగిందని చెప్తుంది. నాకు ఫోన్ చెయ్యగానే నేను వెళ్లానని చెప్పగానే.. వసుధార ప్రాబ్లమ్ లో ఉందని మెసేజ్ రావడం తో నేను వెళ్ళాను.. లోపలికి వెళ్లేసరికి వసుధర స్పృహలో లేదు.. ఎవరో గడియ పెట్టారని మను చెప్తాడు. అటుగా వెళ్తుంటే.. సౌండ్ వచ్చింది నేనే డోర్ ఓపెన్ చేసాను.. వాళ్ళని బయటకు పంపించి లోపల నేను ఉన్నానని ఏంజిల్ అంటుంది. ఎవరో ఇదంతా కావాలనే చేశారు.. వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడుకోవాలని ఇలా చేశారు అని ఏంజిల్ అంటుంది.

థాంక్స్ ఏంజిల్ అని వసుధార చెప్తుంది. ఆ సిచువేషన్ లో ఎవరున్నా కూడా అలాగే చేస్తారని ఏంజిల్ అనగానే అందరు చెయ్యడం వేరే కానీ నువ్వు చేసావని మను అనగానే.. ఫస్ట్ టైమ్ నువ్వు నా గురించి పాజిటివ్ గా మాట్లాడావని ఏంజిల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా అయితే రోజు ఇలా హెల్ప్ చేస్తానని ఏంజిల్ అనగానే అలా ఏం వద్దు లే అంటూ మను నవ్వుతాడు. మా బావ నవ్వుతున్నాడని ఏంజిల్ మురిసిపోతుంది. ఆ తర్వాత వసుధారకి కానిస్టేబుల్ ఫోన్ చేసి రాజీవ్ జైల్లో నుండి తప్పించుకున్నాడని చెప్తాడు. దాంతో వసుధార టెన్షన్ పడుతుంది. అపుడే మహేంద్ర వస్తాడు. రాజీవ్ తప్పించుకున్నాడని వసుధార చెప్తుంది. దానికెందకు టెన్షన్.. శైలేంద్రనే చీట్ చేసి రాజీవ్ ని తానే రప్పించేలా చేసాం.. వాళ్ళిద్దరూ కామెడీ పీస్ అని వసుధారతో మహేంద్ర అంటాడు. అదంతా రాజీవ్ చాటుగా విని నన్ను పట్టించింది శైలేంద్ర నా వాడి సంగతి చెప్తానని రాజీవ్ అనుకుంటాడు.

మరొకవైపు రాజీవ్ వచ్చి తనని ఏదో చేస్తాడని శైలేంద్ర భయపడుతుంటే అప్పుడే రాజీవ్ వస్తాడు.. రాజీవ్ ని చూసి శైలేంద్ర భయపడతాడు. నువ్వే నన్ను పట్టించావని తెలుసని గన్ శైలేంద్ర తలపై పెడతాడు. అప్పుడే దేవయాని వచ్చి.. శైలేంద్ర నాకు జరిగింది చెప్పాడు. రాజీవ్ ని మోసం చెయ్యడం కరెక్ట్ కాదని వార్నింగ్ ఇచ్చాను. మీరిద్దరు కలిసికట్టుగా ఉంటేనే ఏదైనా చెయ్యగలరు.. మీ వీక్ పాయింట్ తో వాళ్ళు మిమ్మల్ని దెబ్బకొడుతున్నారు అంటూ దేవయాని చెప్తుంది. ఆ తర్వాత ధరణి, దేవయాని, మహేంద్ర ఇంటికి వచ్చి.. ధరణి, శైలేంద్రతో పూజ జరిపిస్తున్నాను.. మీరు రండి అని అనుపమ, వసుధార, మహేంద్రలకి దేవయాని చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.