English | Telugu

Guppedantha Manasu : రాజీవ్ ని కలవడానికి వెళ్తున్న వసుధార.. ఎవరి ప్లాన్ వారిదే! 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -1076 లో... మహేంద్ర, వసుధార ఇంటికి వచ్చి అనుపమకి జరిగింది మొత్తం చెప్పగా.. మీరు చాలా రిస్క్ చేస్తున్నారని అనుపమ అంటుంది. ఇంతకంటే వేరే మార్గం లేదని మహేంద్ర అంటాడు. ఇన్ని రోజులుగా కాపాడుకుంటూ వస్తున్న కాలేజీని వాడికి ఎలా అప్పగిస్తారు. కాలేజీ కోసం రిషి దూరంగా ఉన్నాడు.. జగతి చనిపోయింది.. ఇంత ఈజీగా కాలేజీని వాడికి వదిలేస్తారా అని అనుపమ అంటుంది. ఇదంతా నాటకం అని చెప్పానుగా అని మహేంద్ర అంటాడు..

అయినా సరే నాకు కంగారుగా ఉందని అనుపమ అంటుంది. నువ్వు దాని గురించి ఏం టెన్షన్ పడకని మహేంద్ర చెప్తాడు. మరొకవైపు రాజీవ్ ని శైలేంద్ర కలుస్తాడు. మనం కలవక చాలా రోజులవుతుందని రాజీవ్ అనగానే.. అవసరం ఉంటేనే వస్తానని చెప్పాను కదా అని శైలేంద్ర అంటాడు. కాలేజీని నా చేతికి తీసుకుందామంటే నీ మరదలు అడ్డు వస్తుంది... లేపేద్దాం అంటే నీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నా అని శైలేంద్ర అంటాడు. ఇప్పుడు మంచి ఛాన్స్ ఆ వసుధరని ఇక్కడ నుండి తీసుకొని వెళ్లొచ్చు కదా అని రాజీవ్ తో శైలేంద్ర అనగానే.. నువ్వే కదా బయటకు రావద్దు.. వసుధారకి కన్పించకు అని చెప్పింది అని రాజీవ్ అంటాడు. నేనే ఒక దగ్గరికి వసుధారని తీసుకొని వస్తాను.. ఎక్కడికి అయినా తీసుకొని వెళ్ళు అని శైలేంద్ర అనగానే రాజీవ్ సరే అంటాడు. ఆ తర్వాత కానిస్టేబుల్ సహాయంతో వసుధారకి మను ఫోన్ చేస్తాడు.

అందరు అక్కడే ఉన్నారా... అనుపమ మేడమ్ ఎలా ఉందని మను అడుగుతాడు. అప్పుడే అనుపమ ఫోన్ తీసుకొని.. బాగున్నానంటూ ఎమోషనల్ అవుతుంది. మీరు నా గురించి చాలా రిస్క్ చేస్తున్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఆడుతుంది నాటకమని తెలిస్తే వాడు మళ్ళీ మాట వినడని మహేంద్ర, వసుధారలకి మను చెప్తాడు.. మేమ్ ప్లాన్ ప్రకారం ఫాలో అవుతున్నాం.. మీరు టెన్షన్ పడకండి అని వసుధార చెప్తుంది. ఆ తర్వాత మహేంద్ర ఇంటికి శైలేంద్ర వచ్చి.. ఇప్పుడు వసుధారని నాతో తీసుకొని వెళ్తానని అనగానే దానికి నేను ఒప్పుకోనంటూ మహేంద్ర అంటాడు. ఇప్పుడు ఆ రాజీవ్ దగ్గరికి తీసుకొని వెళ్తున్నావా అని మహేంద్ర అనగానే.. అవును వాడు సంతోషంగా వసుధారని కలవడానికి వస్తాడు. పోలీసులకి రాజీవ్ గురించి ముందే ఇన్ఫర్మేషన్‌ ఇచ్చాను లొకేషన్ కూడా పంపించాను. వసుధార దగ్గరికి రాజీవ్ రాగానే పోలీసులు రాజీవ్ ని పట్టుకుంటారు. అది ప్లాన్ అని శైలంద్ర అంటాడు. అయితే నేను వస్తానని మహేంద్ర అంటాడు. వద్దు ఫాలో కూడా అవ్వొద్దని మహేంద్రతో శైలేంద్ర అంటాడు. నేను వెళ్తాను మావయ్య.. మీ కొడుకుని కాపాడతానని వసుధార అనగానే అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.